IND vs AUS: వన్డే వరల్డ్కప్లో భాగంగా భారత్ ఆడిన ఒక్క మ్యాచ్ కూడా దక్కని రెండు తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులకు మరో బ్యాడ్ న్యూస్. ప్రపంచకప్లో మ్యాచ్ దక్కకున్నా కనీసం ఈ మెగా టోర్నీ ముగిశాక భారత్ – ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 03న ఉప్పల్ వేదికగా జరుగబోయే ఐదో టీ20ని అయినా చూసి ఆనందిద్దామనుకున్న అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. సరిగ్గా అదే రోజు (డిసెంబర్ 3) తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనుండటంతో ఈ మ్యాచ్ను హైదరాబాద్ నుంచి బెంగళూరుకు తరలించినట్టు తెలుస్తున్నది.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఉప్పల్ వేదికగా అదే రోజు జరుగబోయే మ్యాచ్కు భద్రత కల్పించలేమని తెలంగాణ పోలీసులు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ)కు తేల్చి చెప్పారు. ఇదే విషయాన్ని హెచ్సీఏ.. బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లింది. అయితే ఈ సిరీస్లో భాగంగా నవంబర్ 23న విశాఖపట్నంలో జరిగే తొలి మ్యాచ్ను హైదరాబాద్కు తరలించి ఐదో మ్యాచ్ను వైజాగ్కు తరలించాలని కోరినా బీసీసీఐ దానిని పరిగణనలోకి తీసుకోలేదని తెలుస్తోంది.
Sad news for Hyderabad and Nagpur fans :
Matches scheduled for India vs Australia T20 series set to be Shifted to Bangalore and Raipur.
4th T20i – From Nagpur will be shifted to Raipur.
5th T20i – From Hyderabad will be shifted to Bangalore.Feel for Hyderabad & Nagpur fans,… pic.twitter.com/NidcmlQsC5
— All About Cricket (@allaboutcric_) November 8, 2023
హైదరాబాద్ టీ20ని బెంగళూరుకు మార్చిన బీసీసీఐ.. నాలుగో టీ20 వేదికను కూడా మార్చింది. షెడ్యూల్ ప్రకారం.. నాలుగోమ్యాచ్ నాగ్పూర్లో జరగాల్సి ఉండగా పలు కారణాల రీత్యా దానిని రాయ్పూర్కు మార్చినట్టు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. దీనిపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) దీనిమీద అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.