హాంగ్జౌ: ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు వచ్చి చేరాయి. పురుషుల రెజ్లింగ్ 86 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో భారత రెజ్లర్ దీపక్ పూనియా రజత పతకం సాధించాడు. ఫైనల్లో ఇరాన్ రెజ్లర్ హసన్ యజ్దానీతో తలపడిన దీపక్ పూనియా 10-0 తేడాతో ఓటమిపాలై రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. ఫైనల్లో విజయంతో యజ్దానీ గోల్డ్ మెడల్ దక్కించుకున్నాడు.
అదేవిధంగా మెన్స్ చెస్లో కూడా భారత్కు రజతం దక్కింది. భారత్ ఆటగాళ్లు విదిత్, అర్జున్, హరికృష్ణ తమ 9వ రౌండ్లో ఫిలిప్పీన్స్తో తలపడి రెండో స్థానానికి చేరడం ద్వారా రజతం గెలుచుకున్నారు. ఇరాన్ ఆటగాళ్లు అగ్రస్థానంతో గోల్డ్ మెడల్ ఎగరేసుకు పోయారు. కాగా, ఆసియా క్రీడల్లో భారత్ ఇప్పటివరకు మొత్తం 105 పతకాలు గెలిచినట్లయ్యింది. అందులో 28 స్వర్ణాలు, 36 రజతాలు 41 కాంస్యాలు ఉన్నాయి.