సామ్సంగ్ భారత విపణిలోకి సామ్సంగ్ గెలాక్సీ ఎమ్32 5జీ ఫోన్ను తీసుకొచ్చింది. ఆకర్షణీయమైన ఫీచర్లతో.. బడ్జెట్ ధరలో ఫోన్ను తాజాగా విడుదల చేసింది. ఇప్పటికే ఈ ఫోన్కు సంబంధించిన ఫీచర్లు ఆన్లైన్లో లీక్ అయ్యాయి.
సామ్సంగ్ గెలాక్సీ ఎమ్32 5జీ ఫోన్.. రెండు వేరియండ్లలో విడుదలైంది. 6జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ధర రూ.20,999 కాగా.. 8జీబీ ప్లస్ 128 జీబీ మోడల్ ధర ఇంకా వెల్లడించలేదు. రెండు కలర్స్ స్లేట్ బ్లాక్, స్కై బ్లూ కలర్లో ఈ ఫోన్ లభిస్తుంది. ఫోన్ను తాజాగా లాంచ్ చేసినప్పటికీ.. సేల్స్ మాత్రం సెప్టెంబర్ 2 నుంచి ప్రారంభం కానున్నాయి.
సెప్టెంబర్ 2న అమెజాన్లో మధ్యాహ్నం 1 నుంచి ఈ ఫోన్ సేల్స్ ప్రారంభం కానున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా ఈ ఫోన్ను కొనుగోలు చేస్తే 2000 వరకు ఇన్స్టాంట్ డిస్కౌంట్ లభించనుంది.
డ్యుయల్ నానో సిమ్, ఆండ్రాయిడ్ 11 ఆధారిత వన్యూఐ 3.1, 6.5 ఇంచ్ హెచ్డీ ప్లస్ టీఎఫ్టీ ఇన్ఫినిటీ వీ డిస్ప్లే, ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 720 ఎస్వోసీ, 5జీ నెట్వర్క్, వైఫై, బ్లూటూత్, జీపీఎస్, ఫింగర్ ప్రింట్ స్కానర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 15 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్, 48 ఎంపీ రేర్ కెమెరా లాంటి ఆకర్షణీయమైన ఫీచర్లతో ఈ ఫోన్ విడుదలైంది.