వాషింగ్టన్: ఆపిల్ ఐఫోన్ లవర్స్కు గుడ్న్యూస్. వచ్చే ఏడాది రాబోయే అన్ని ఐఫోన్లూ 5జీతోనే వస్తున్నాయి. అవి కూడా బడ్జెట్ ఫోన్లే కావడం విశేషం. 5జీతో కూడిన కొత్త ఐఫోన్ ఎస్ఈపైనా ఆపిల్ పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త ఐఫోన్ వాళ్ల సొంత ఎ15 ప్రాసెసర్తో రానుంది. ఈ ఏడాది ప్రిమియం ఐఫోన్లలోనూ ఇదే చిప్ వాడుతున్నారు. క్వాల్కామ్ ఎక్స్60 మోడెమ్ చిప్ ద్వారా ఈ ఫోన్లో 5జీ ఎనేబుల్ చేయనున్నారు.
వచ్చే ఏడాది తొలి అర్ధభాగంలోనే అన్ని 5జీ ఐఫోన్లను ఆపిల్ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ కొత్త బడ్జెట్ 5జీ ఫోన్ కూడా ఇప్పుడున్న ఎస్ఈ మోడల్లాగే ఐఫోన్ 8 రీఫ్రెష్ వెర్షన్లో రానుంది. ఈ ఫోన్లో 4.7 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే ఉండనున్నట్లు నిక్కీ వెల్లడించింది. వచ్చే ఏడాది 4జీ కొత్త మోడల్స్ ఏవీ ఆపిల్ రిలీజ్ చేసే అవకాశాలు లేవు.