పొదుపు పథకాలు భారతీయ పౌరులకు ప్రభుత్వం, ప్రభుత్వ ఆర్థిక సంస్థలు ప్రారంభించిన పెట్టుబడి ఎంపికలు. ఈ పొదుపు పథకాలు భారతదేశంలో ఆరోగ్యకరమైన పొదుపు, పెట్టుబడి అలవాట్లను పెంపొందించడానికి ప్రోత్సాహకంగా ప్రవేశపెట్టబడ్డాయి. భారత ఆర్థికవ్యవస్థలోకి డబ్బు ప్రవాహాన్ని పెంచడానికి ఇది కూడా ఒక మార్గం.
పూర్వీకులు తమ డబ్బును తమ వద్దే నిల్వ చేసుకునేవారు. డబ్బు చలామణిలో లేకపోవడం వల్ల సంపద స్తబ్ధతకు కారణమైంది. అయితే స్వాతంత్య్రం వచ్చాక ప్రజలు సంపాదించిన డబ్బును రెట్టింపు చేసుకోవడం, పొదుపు చేసుకోవడం వంటి అంశాల పట్ల ప్రభుత్వం అవగాహన కల్పించింది. దానికోసం అనేక రకాల పొదుపు పథకాలను ప్రవేశపెట్టింది. దీంతో ప్రజలు తమ సంపదను పెంచుకోవడం, పన్ను మినహాయింపులు పొందటం, వడ్డీలు పెంపొందించుకోవడం చేసుకున్నారు.
పొదుపు పథకాలు విస్తృత జనాభాకనుగుణంగా ఉంటాయి. వీటిని పదవీ విరమణ, పిల్లల ఉన్నత విద్య, వారి వివాహం మొదలైన జీవితంలోని ప్రధాన అవసరాల కోసం పొదుపు చేసేలా వ్యక్తులను ప్రోత్సహిస్తాయి.
ఈ పథకాలు నిర్దిష్ట సమయానికి చెల్లించేటట్టు, అవసరానికి అందేటట్టు ఉంటాయి. దీర్ఘకాలిక సంపద సృష్టికి కూడా అనువైనవి. పొదుపు పథకాలు మార్కెట్ అస్థిరతతో ప్రభావితమయ్యే అవకాశం లేనందున ఒకరకంగా అవి సురక్షితమైన పెట్టుబడి ఎంపికలు. సాం ప్రదాయిక పెట్టుబడిదారులకు అనువైన వి. అంతేకాకుండా, పెరుగుతున్న జీవన వ్యయాలు, ద్రవ్యోల్బణానికి అనుగుణం గా వివిధ పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు త్రైమాసిక లేదా అర్ధ వార్షిక ప్రాతిపదికన సవరించబడతాయి. పొదుపు పథకాలు అనేకం ఉన్నప్పటికీ వాటిలో ఫిక్స్డ్ డిపాజిట్, సుకన్య సమృద్ధి యోజన, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, పబ్లిక్ ప్రావిడెం ట్ ఫండ్, కిసాన్ వికాస్ పత్ర, పోస్ట్ ఆఫీ స్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్, నేషనల్ సేవిం గ్ సర్టిఫికెట్ అనేవి అత్యంత ఆదరణ పొందాయి. కానీ, ఇప్పుడు కేంద్ర ప్రభు త్వం అవలంబిస్తున్నటువంటి ఆర్థిక విధానాల ద్వారా ఈ పథకాలన్నీ కుంటుపడుతున్నాయి. కరోనా మహమ్మారితో అతలాకుతలమైనటువంటి ఆర్థికవ్యవస్థను గాడిలా పెట్టడంలోనూ, పెరిగినటువంటి నిరుద్యోగం, ద్రవ్యోల్బణం లాంటి పరిస్థితులను ఎదుర్కోవడంలో కేంద్రం విఫలమైంది. దేశంలో గతంలో ఎన్నడూ లేనంతగా చిన్న పొదుపు పథకాలకు నిధులు తగ్గడమే ఇందుకు ప్రధాన కారణం. గతే డాదితో పోలిస్తే జాతీయ పొదుపు పథకాల్లో నిధులు 8.5 శాతం తగ్గాయి.
2022 ఆర్థిక సంవత్సరంలో స్మాల్ సేవింగ్ డిపాజిట్లు రూ.3.33 లక్షల కోట్లు ఉండగా, 2023 ఆర్థిక సంవత్సరంలో అవి రూ.3.04 లక్షల కోట్లకు తగ్గిపోయా యి. చిన్న పొదుపు పథకాల కింద నిధుల సేకరణలో అత్యధిక క్షీణత కలిగినటువం టి రాష్ర్టాలను కనుక చూసినట్లయితే బెం గాల్లో 2022 సంవత్సరానికి గాను రూ.28,54 9కోట్లు ఉండగా 2023లో రూ.21,473 కోట్లకు పడిపోయింది. అలాగే మహారాష్ట్రలో రూ.3,856, గుజరాత్లో రూ.4,657, పంజాబ్లో రూ.2, 394, ఢిల్లీలో రూ.3,138 కోట్ల వరకు క్షీణించాయి. దీనికి గల కారణాలను చూసినట్టయితే కేంద్రం పొదుపు పథకాలకు వడ్డీ రేటును తగ్గించడం, దీర్ఘకాలంగా పెంచకపోవడ మే ప్రధాన కారణమని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు.
కేంద్రం కొంతకాలంగా వడ్డీ రేట్లు పెంచుతామని చెప్తున్నప్పటికీ ప్రజలు నమ్మడం లేదు. ఈ చిన్న పొదుపు పథకాల కింద అత్యధిక క్షీణత నమోదైనటువంటి రాష్ర్టాల్లో గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీ, పంజాబ్, పశ్చిమబెంగాల్ ఉన్నాయి. కర్ణాటక, తమిళనాడు, యూపీ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్లు అత్యధిక నికర వసూలు సాధించిన ఐదు రాష్ర్టాలుగా చెప్పవచ్చు. హిమాచల్ప్రదేశ్, మిజోరం, తెలంగాణ, పుదుచ్చేరి, ఛత్తీస్గఢ్, అరుణాచల్ప్రదేశ్, అసోం, బీహార్ నికర వసూలు పెరిగిన రాష్ర్టాలు.
ఎన్ఎస్సీ, పీపీఎఫ్, పోస్టాఫీస్ పొదుపు వంటి చిన్న పొదుపు పథకాలకు ప్రవాస భారతీయులను ఇప్పుడు నామినీగా చేయవచ్చని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్లో తెలిపింది. అంతేకాకుండా ప్రభుత్వం ఇప్పుడు దరఖాస్తుదారులు తమ పేర్లు, ఇంటిపేరులో మార్పు లు చేసుకోవడానికి కూడా అనుమతించింది. ఏదేమైనప్పటికీ కేంద్రం చిన్న పొదుపు పథకాలకు నిధులు తగ్గించడం వల్ల దేశవ్యాప్తంగా వాటి క్షీణత కనిపిస్తున్నదనడంలో సందేహం లేదు.
మోటె చిరంజీవి
99491 94327