ఆధునిక జీవనంలో ప్రతి మనిషి -పెద్ద, చిన్న అందరూ కోరుకునేది, పొందాలని చూసేది వ్యక్తిగత స్వతంత్రం. దానిలో తప్పులేదు. కానీ ఆ స్వతంత్రత తనపట్ల, తన కుటుంబసభ్యుల పట్ల, సమాజం పట్ల బాధ్యతతో కూడుకున్నదా కాదా అన్నదే అతి ముఖ్యమైన ప్రశ్న. ఈ బాధ్యత ఉన్నప్పుడు మనం చేసే ప్రతిపని పక్కవారికి హాని చేస్తుందా అన్న విచక్షణ సహజంగానే ఉంటుంది. ఆ విధంగా కాకుండా కేవలం నా సంతోషమే ముఖ్యం అనుకున్నా, ఆ వ్యక్తి చేసేపని తనకైనా ఆనందం, భద్రత, ఇంకా మెరుగైన జీవితం ఇస్తుందా అన్న తార్కికత చాలా ముఖ్యం. అది లోపించిననాడు మనకు ఎందరో బాధితులు కనపడతారు. వీరు ముఖ్యంగా అత్యాచారాలు, లైంగికదాడులకు బలైనవారు, ఈ వ్యాసానికి పెట్టిన శీర్షిక ఈనాడు జరుగుతున్న సంఘటనల ప్రకారం ఉన్నది.
నిజానికి భద్రంగా సంతోషంగా బతకాలంటే ప్రతివారూ, ముఖ్యంగా ఆడపిల్లలు జీవితపు విలువను గ్రహించాలి. సామాజిక మాధ్యమాల్లో ఎక్కడో పరిచయమయ్యారని ప్రేమించి, భంగపడి ఆత్మహత్యలు చేసుకున్నవారి కథలు, తల్లి దండ్రు లు వ్యతిరేకించారని ఇంట్లోంచి వెళ్ళిపోయి అవ్యక్తితో సహజీవనం చేసేవారు. తీరా పెళ్ళి ప్రసక్తి రాగానే వారు వ్యతిరేకిస్తే వారి దాష్టీకానికి బలవుతున్నారు. ప్రేమించడం తప్పుకాదు. కానీ యువత, గ్రహించవలసినదేమిటంటే, వారికి మొదటగా కలిగేది ఆకర్షణ వల్ల కలిగే మోహం. ఇది చాల సహజమైన భావన. కానీ ఇక్కడే వారికి, ముఖ్యం గా ఆడ పిల్లలకు చాలా విచక్షణ కావాలి. అది మోహం అయితే, కామవాంఛలు తీరగానే చల్లారిపోతుంది. ఇది మగవారికి త్వర గా జరుగుతుంది. అంటే ఇక్కడ గ్రహించాల్సిన విషయం ఒకటుంది. భౌతికంగా ఆడ, మగ వారి శరీర నిర్మాణంలో, దారుఢ్యంలో తేడాలు ఉన్నట్టే, మానసికంగా కూడా చా లా తేడా ఉంటుంది.
నిజం చెప్పాలంటే ఈ తేడాలు దాదాపు వ్యతిరేకంగా ఉంటాయి. నోబెల్ ప్రైజ్ గ్రహీ త రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ తేడాలు చాల చక్కగా వివరిస్తారు. సృష్టిచేసిన భగవంతు డు మానవులకు ఉండవలసిన లక్షణాలన్నిటినీ ఒకపట్టిక చేసి, వాటిని రెండు భాగాలు గా విభజించి, ఒక భాగాన్ని పురుషులకు, ఇంకో భాగాన్ని స్త్రీలకు ఇచ్చాడని చెప్తారు. ఈ రెండూ కలిస్తేనే సంపూర్ణమానవత్వం సిద్ధిస్తుందనీ, అందుకే స్త్రీపురుష సంబంధా లు శాశ్వతంగా ఉంటేనే అది సాధ్యమౌతుందనీ భావిస్తారు. దాన్ని, నాగరికత పెరిగిన తరువాత, సుస్థిరం చేయటానికి వివాహ వ్యవస్థ ఏర్పరుచుకుంది మానవజాతి. అయితే ఆధునిక కాలంలో పాశ్చాత్య అనాగరిక పోకడల ప్రవాహంలో కొట్టుకుపోతున్న యువత ఈ విషయాల అవగాహన లేక, తమ మనసుకు ఏది తోస్తే అది చేయడమే స్వతంత్రంగా జీవించటం అని భ్రమపడుతున్నారు.
మనసు అనేది చిత్తం, బుద్ధికి మధ్యలో ఉంటుంది.చిత్తం అంటే ఇంపల్స్. మోహం అనే భావన చిత్తంలో కలుగుతుంది. పై స్థాయి అయిన మనసు విషయంలో కూ డా ఆడ, మగ జాతులలో మానసికంగా తేడాలున్నాయి. చిత్తంలో కలిగిన మోహం ఆడవారిలో అది ప్రేమ అన్న భావం కలిగి స్తే, మగవారిలో కామవాంఛలు ప్రకోపిస్తా యి. ఇక్కడ ఆడవారికి అటువంటి వాంఛ లు ఉండవు అని చెప్పడం ఉద్దేశ్యం కాదు. కానీ, వారు కోరుకునేది కేవలం లైంగిక తృ ప్తికాదు, తాను ప్రేమించే వారినుండి తిరిగి ప్రేమ పొందాలన్న భావన పెంపొందుతుం ది. అయితే అట్లా మోహంతో శారీరక సంబ ంధం పెట్టుకున్న జంటలలో మగవారు సున్నిత స్వభావ బాధ్యతాయుత భావాలు ఉన్నవారైతే ఆసంబంధాన్ని శాశ్వతం చేసుకోవడానికి అంగీకరిస్తారు.
అలా వివాహం కాకుండానే దగ్గరయి నా, వీరిద్దరూ తర్వాతైనా వివాహ వ్యవస్థ లో స్థిరపడడం జరుగుతుంది. కానీ విచారకరమైన నిజం ఏమిటంటే 75 నుండి 80 శాతం దాకా మగవారికి కామవాంఛలు తీరగానే మోహం ఆవిరైపోతుంది. అక్కడే ఈ వ్యతిరేక మానసిక భావాలు సంఘర్షణ లో చిక్కుకుంటాయి. చాలామంది అమ్మాయిలు తాము సంబంధం పెట్టుకున్న వ్యక్తులను నిజంగానే ప్రేమించటం మొదలు పెడతారు. ఆకర్షణ వల్ల కలిగిన వాంఛ అన్నది బలపడి జీవితాంతం ఆవ్యక్తితో బతకాలని కోరుకుంటారు.దానికి సరైన మార్గంగా పెళ్ళి చేసుకోవాలని భావించి, తమ భాగస్వాములను పెళ్లికి బలవంతపెడుతారు. అలా ఇష్టంలేని మగవారు పిరికివారైతే ఆమెకు కనిపించకుండా వెళ్లిపోతారు.అవకాశవాదులైతే ఎదురువాదించి బ్లాక్ మెయి ల్ చేస్తా రు. ఎలాగోలా బెదిరించి, భయపెట్టి వదిలించుకుంటారు. నేర ప్రవృత్తి గలవాడైతే వారిని చంపటానికి కూడా వెనకాడడు.
నిజానికి ఒక పురుషుడు కానీ, స్త్రీ కానీ విద్యావంతులయ్యాకనే తమకు సరిపోయి న భాగస్వాములను సామాజిక ప్రక్రియ అయిన వివాహం చేసుకోవాలి. ఈ ఎన్నికలో నే తమవిచక్షణ చూపాలి. అయితే వారి శారీరక వాంఛలన్నీ వివాహ జీవితంలో మాత్రమే తీర్చుకోవాలి.అందుకే ధర్మ,అర్థ, కామ, మోక్షాలు అన్న ప్రతిపాదన చేశాయి.
ఇక పై విధంగా జరగాలంటే ఒకే సమాజంలో బతుకుతున్న స్త్రీపురుషులిద్దరికీ, ఎ దుటి వారి పట్ల బాధ్యత ఉండాలి. పురుషు లు ప్రతి పరాయి స్త్రీని తల్లిలాగ భావించాలని శాసించినట్టే, శారీరకంగా బలహీనమైన స్త్రీలను తమ పరిధులలో, కట్టుబాట్లలో ఉండమని, వారి భద్రతకోసమే చెప్తారు పెద్దవాళ్ళు.
ఒక ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించాలంటే స్త్రీ పురుషులకిద్దరికీ ఆ బాధ్యత ఉంది. మన ప్రతి చర్యకి ఒక ప్రతిచర్య ఉం టుంది. ఆ విచక్షణ పెంచుకుని బాధ్యతగా మెలగడం ప్రతివారి ధర్మం! ‘జీవితం – పెండ్లి -ప్రేమ – కామం – మోహం అన్న పద్ధతిలో ఆలోచిస్తే రెండుతరాల కింద డెభ్బై ఏండ్లు దాటి కూడా ఒకరిమీద ఒకరు ఛలోక్తులు వేసుకుంటూ సరదాగా జీవితాన్ని సంతోషమయం చేసుకున్న మన తాత అమ్మమ్మలు, నాయనమ్మలు గుర్తువస్తారు. జీవితం ఆనందంగా ఉంటుంది.