AIIMS Raebareli Recruitment | ఆడియోమెట్రీ టెక్నీషియన్, సీఎస్ఎస్డీ టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్, మానిఫోల్డ్ టెక్నీషియన్, ఐసీయూ టెక్నీషియన్ తదితర పోస్టుల భర్తీకి ఉత్తరప్రదేశ్(UP) రాష్ట్రం రాయ్బరేలి (Raebareli)లోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. రాత పరీక్ష, పని అనుభవం, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 111
పోస్టులు : ఆడియోమెట్రీ టెక్నీషియన్, సీఎస్ఎస్డీ టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్, మానిఫోల్డ్ టెక్నీషియన్, ఐసీయూ టెక్నీషియన్ తదితరాలు.
అర్హతలు: పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయసు: 45 ఏండ్లు మించకూడదు.
ఎంపిక : రాత పరీక్ష, పని అనుభవం, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1000. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.500,
దరఖాస్తు : ఆన్లైన్లో
దరఖాస్తు చివరి తేది: ఆగష్టు 06
వెబ్సైట్ : https://aiimsrbl.edu.in/