ధర్పల్లి/ కోటగిరి/ నిజామాబాద్ రూరల్/ ఇందల్వాయి/ డిచ్పల్లి/బాల్కొండ/మాక్లూర్ , డిసెంబర్ 3 : ఆయిల్పామ్ సాగు ద్వారా రైతులు అధిక లాభాలు గడించవచ్చని వ్యవసాయాధికారులు అన్నారు. జిల్లాలోని వివిధ గ్రామాల్లో రైతులతో శనివారం సమావేశాలు ఏర్పాటు చేసి ఆయిల్పామ్ సాగుపై అవగాహన కల్పించారు. ఈ పంటను సాగుచేసే రైతులకు ప్రభుత్వం సబ్సిడీలు కల్పించి ప్రోత్సహిస్తున్నదని వివరించారు. పంటను సాగు చేసే విధానం, ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.
మాక్లూర్ మండల కేంద్రంలో రైతులకు ఆయిల్ పామ్ పంటల సాగుపై అవగాహన సదస్సును డీఏవో తిరుమల ప్రసాద్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఆయిల్ పామ్ పంటలపై రైతుల సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ అశోక్రావు, ఎంపీటీసీ వెంకటేశ్, ఏవో పద్మ, ఎంపీవో శ్రీనివాస్, మండల కోఆప్షన్ సభ్యుడు అహ్మద్, ఉసర్పంచ్ అనిత పాల్గొన్నారు.
ఆయిల్పామ్సాగుతో అధిక లాభాలు వస్తాయని భీమ్గల్ ఏడీఏ మల్లయ్య అన్నారు. బాల్కొండ మండలంలోని వన్నెల్(బీ) గ్రామంలో ఆయిల్ పామ్ పంట సాగుపై శనివారం రైతులకు అవగాహన కల్పించారు. ఏడీఏ మాట్లాడుతూ ఆయిల్పామ్ మొక్కలను రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రాయితీపై ఇస్తోందని తెలిపారు. 4 ఏండ్ల వరకు ఆయిల్పామ్, అంతర పంటల సాగు నిర్వహణ ఖర్చు కోసం ఎకరానికి రూ.4,200 ఇస్తుందని తెలిపారు. అంతర పంటలకు కోసం ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం బీసీలకు 90 శాతం, డీసీలోకు 80 శాతం రాయితీపై డ్రిప్ పరికరాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. మొక్కలు నాటేందుకు గుంతలు ప్రభుత్వమే తవ్విస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ నాగులపల్లి కిషన్, పీఏసీఎస్ చైర్మన్ నాగులపల్లి సూరజ్, నిహారిక, కృష్ణవేణి, గ్రామ కార్యదర్శి, వీఆర్ఏ పాల్గొన్నారు.
ధర్పల్లి మండలంలోని మైలారంలో రైతులతో మండల వ్యవసాయాధికారి ప్రవీణ్ అవగాహన కల్పించారు. ఆయిల్ పామ్ మొక్కలు ఎకరానికి 50 మొక్కలు పెట్టుకోవాలని, ఒక మొక్క ఖరీదు రూ.193 కాగా ప్రభుత్వం సబ్సిడీపై రూ.20కి అందజేస్తున్నదని తెలిపారు. సాగు చేయాలనుకునే రైతులు ఎకరానికి వెయ్యి రూపాలయ చొప్పున రూపాయల డీడీ తీసి ఏఈవోలకు అందజేయాలని సూచించారు. సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్ రాజేందర్రెడ్డి, ఏఈవో లక్ష్మీప్రసన్న, రమేశ్, రైతుబంధు సమితి గ్రామ కో-ఆర్డినేటర్ నర్సయ్య పాల్గొన్నారు.
కోటగిరి మండలంలోని ఎత్తొండ గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో మండల వ్యవసాయాధికారి శ్రీనివాసరావు రైతులకు అవగాహన కల్పించారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయాలని సూచించారు. సమావేశంలో ఇన్చార్జి ఎంపీడీవో మారుతి, సర్పంచ్ సాయిబాబా, పంచాయతీ కార్యదర్శి ఉమాకాంత్, ఏఈవో సందీప్, రైతులు పాల్గొన్నారు.
నిజామాబాద్ రూరల్ మండలం మల్లారంలో మండల వ్యవసాయాధికారి హీరాజాదవ్ రైతులకు అవగాహన కల్పించారు. సమావేశంలో సర్పంచ్ నగేశ్, వైస్ ఎంపీపీ అన్నం సాయిలు, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) మండల అధ్యక్షుడు మీసాల మధుకర్రావు, పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్కుమార్, ఏఈవో ఉమాకాంత్, ఉపసర్పంచ్ రవి పాల్గొన్నారు.
ఇందల్వాయి గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో సర్పంచ్ పాశం సత్తెవ్వ అధ్యక్షతన ఆయిల్ పామ్ సాగుపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఉద్యానవన శాఖ అధికారిణి సంధ్య ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు మారంపల్లి సుధాకర్, ఏఈవోలు ప్రకాశ్ గౌడ్, శ్రీహరి, సతీశ్, ఎంపీవో రాజ్కాంత్రావు, ఉపసర్పంచ్ రాజేందర్, రైతుబంధు సమితి గ్రామ కో-ఆర్డినేటర్ గంగారాం పాల్గొన్నారు.
డిచ్పల్లి మండలంలోని యానంపల్లిలో మండల వ్యవసాయ అధికారి రాంబాబు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీవో కిషన్రావు, సర్పంచ్ గోపు చిన్నూబాయి, ఏఈవోలు భావన, రూపేశ్, సంధ్యారేఖ, అశ్రిత పాల్గొన్నారు.
బోధన్ రూరల్ మండలంలోని పెగడాపల్లి రైతు వేదికలో ఏవో సంతోష్నాయక్ మాట్లాడారు. ఎంపీడీవో మధుకర్, సొసైటీ చైర్మన్ రాజారెడ్డి, సర్పంచ్ గుండారం శంకర్, నాలుగు గ్రామాల సర్పంచులు, ఏఈవోలు సరోజా, సాయిలు తదితరులు పాల్గొన్నారు.
భీమ్గల్ మండంలోని చేంగల్ రైతువేదికలో ఏవో సాయికృష్ణ, ఏఈవో అరవింద్, ఎంపీవో గంగామోహన్, ఏపీవో నర్సయ్య, సర్పంచ్ చిన్నారెడ్డి పాల్గొన్నారు.
కమ్మర్పల్లి మండలం చౌట్పల్లి గ్రామంలో హర్టికల్చర్ అధికారి సుమన్ రైతులకు ఆయిల్పామ్ సాగుపై అవగాహన కల్పించారు. ఎంపీవో శ్రీనివాస్, ఏపీవో విద్యానంద్, సర్పంచ్ మారుశంకర్, ఉపసర్పంచ్ రమాదేవి, ఎంపీటీసీ నర్సయ్య, ఏఈవో పద్మ పాల్గొన్నారు.
నవీపేట మండలంలోని నందిగామ గ్రామంలో ఏవో సురేశ్గౌడ్, సర్పంచ్ లావణ్య కిషన్రావు, ఎంపీటీసీ లలిత, ఎంపీడీవో సయ్యద్ సాజీద్ అలీ, ఎంపీవో రామకృష్ణ, ఏపీవో రాజేశ్వర్, ఏఈవో పాల్గొన్నారు.
వేల్పూర్ మండలంలోని రామన్నపేట్లో సర్పంచ్ వీణా పురుషోత్తం, ఉప సర్పంచ్ నవీన్, ఎంపీటీసీ వనజా శోభన్, సొసైటీ చైర్మన్ మోహన్రెడ్డి, ఏవో నర్సయ్య, ఏపీవో అశోక్, ఎంపీవో జావిద్ అలీ, ఏఈవోలు, పంచాయతీ కార్యదర్శి, రైతులు పాల్గొన్నారు.
రెంజల్, డిసెంబర్ 3 : మండలంలోని బోర్గాంలో ఏవో లక్ష్మీకాంత్రెడ్డి, సర్పంచ్ వాణి, ఎంపీవో గౌసొద్ధీన్, రెంజల్ విండో ఇన్చార్జి చైర్మన్ మొహినుద్దీన్, ఏపీవో శరత్, ఏఈవోలు పాల్గొన్నారు.
ఎడపల్లి మండలం జైతాపూర్లో సర్పంచ్ శ్రీలక్ష్మీ రాంగోపాల్ రెడ్డి, సొసైటీ చైర్మన్ కె.సత్యనారాయణ. మండల వ్యవసాయాధికారి సిద్ది రాములు పాల్గొన్నారు.
ఏర్గట్ల మండలం తొర్తిలో మండల వ్యవసాయాధికారి మహ్మద్ అబ్దుల్ మాలిక్ రైతులకు ఆయిల్పామ్ సాగుపై అవగాహన కల్పించారు. సర్పంచ్ కుండ నవీన్, వైస్ ఎంపీపీ సల్ల లావణ్య, ఉప సర్పంచ్ తాహెర్, రైతు బంధు సమితి సభ్యుడు వెంకటేశ్, ఏఈవో అరుణ పాల్గొన్నారు.
ముప్కాల్ మండల కేంద్రంలో ఏవో రాజ్కుమార్, సర్పంచ్ కొమ్ముల శ్రీనివాస్, రైతు బంధు సమితి గ్రామ అధ్యక్షుడు గడ్డం ప్రతాప్రెడ్డి, ఏఈవో సంధ్య, ఏపీవో అనిల్, పంచాయతీ సెక్రటరీ విజయ్ కుమార్ పాల్గొన్నారు.