హైదరాబాద్ : టీఎస్ ఐసెట్-2021 ప్రవేశాలకు సంబంధించి ప్రత్యేక విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ను తెలంగాణ ఉన్నత విద్యామండలి గురువారం విడుదల చేసింది. ఈ నెల 28, 29న ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ బుకింగ్స్ చేసుకోవాలి. 29న ధ్రువ పత్రాలను పరిశీలించనున్నారు. ఈ రెండు రోజుల్లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి.
ఈ నెల 30న ఎంబీఏ, ఎంసీఏ ప్రత్యేక విడత సీట్లను కేటాయించనున్నారు. అదే రోజు స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు. ఇక సీట్లు పొందిన అభ్యర్థులు డిసెంబర్ 1వ తేదీ లోపు సంబంధిత కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి, ట్యూషన్ ఫీజు చెల్లించాలి.