న్యూఢిల్లీ: దేశంలో అగ్రశ్రేణి ప్రభుత్వరంగ సంస్థల్లో ఒకటైన ఎన్ఎండీసీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 22 వరకు అందుబాటులో ఉండనున్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా 89 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో ఎగ్జిక్యూటివ్ గ్రేడ్, సూపర్వైజరీ గ్రేడ్, నాన్-ఎగ్జిక్యూటివ్ గ్రేడ్ పోస్టులు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులను జార్ఖండ్లోని టొకిసుడ్ నార్త్ కోల్మైన్లో నియమిస్తారు.
మొత్తం పోస్టులు: 89
ఇందులో మైన్ సిర్దార్ 38, మైన్ ఓవర్మ్యాన్ 25, మైనింగ్ ఇంజినీర్ 12, మెకానికల్ ఓవర్మ్యాన్ 4, ఎలక్ట్రికల్ ఓవర్మ్యాన్ 4, సర్వేయర్ 2, కొల్లిరి ఇంజినీర్ 2, లియాసొనింగ్ ఆఫీసర్ 2 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఇంజినీరింగ్లో మెకానికల్, మైనింగ్ మెషినరీ, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మైనింగ్ ఇంజినీరింగ్లలో ఏదో ఒకటి చేసి ఉండాలి. మైనింగ్ సిర్దార్ పోస్టుకు పదో తరగతి పాసై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, స్కిల్టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 22
వెబ్సైట్: www.nmdc.co.in