77వ జాతీయ నమూనా సర్వే
77వ జాతీయ నమూనా సర్వే కేంద్ర ప్రభుత్వం 2018 జూలై నుంచి 2019 జనవరి మధ్య కాలంలో నిర్వహించింది.
77వ జాతీయ నమూనా సర్వే కేంద్ర గణాంక శాఖ ‘సిచువేషన్ అసెస్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ హౌస్హోల్డ్స్ అండ్ ల్యాండ్ హోల్డింగ్స్ ఆఫ్ హౌస్హోల్డ్స్ ఇన్ రూరల్ ఇండియా-2019’ సర్వేని 2021, సెప్టెంబర్ 10న విడుదల చేసింది.
ఈ సర్వేని మొదటిసారిగా 1950-51లో విడుదల చేశారు.
దేశంలో వ్యవసాయ కుటుంబాలు 9.3 కోట్లు.
దేశంలో మొత్తం 10.18 కోట్ల భూకమతాలు ఉన్నాయి.
దేశంలో 2.5 ఎకరాలు ఉన్న రైతులు 72.6 శాతం, తెలంగాణలో 42.2 శాతం ఉన్నారు.
వ్యవసాయ రుణాలను సద్వినియోగం చేసుకోవడంలో తెలంగాణ దేశంలో ప్రథమ స్థానంలో ఉంది.
దేశంలో సగటు అధిక విస్తీర్ణంలో వ్యవసాయం చేస్తున్న రైతుల్లో తెలంగాణ రెండవ, రాజస్థాన్ మొదటి స్థానంలో ఉన్నాయి.
రాష్ట్రంలో ఒక్కో రైతు సగటున 1.50 హెక్టార్లలో వ్యవసాయం చేస్తున్నారు.
కౌలు కమతాలు అధికంగా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
కౌలుకు ఇచ్చే భూమి అధికంగా ఉన్న రాష్ట్రం హర్యానా
తెలంగాణలో కౌలు కమతాలు ఇచ్చే భూమి 17.5 శాతం కాగా, కౌలుకు చేసే భూమి 11.9 శాతం
దేశంలో కౌలు కమతాల సంఖ్య 2002-03లో 9.9 శాతం ఉంటే 2018-19లో 17.3 శాత ఉంది. ఇదే సమయంలో కౌలు చేసే విస్తీర్ణం 6.5 శాతం నుంచి 13 శాతానికి పెరిగింది.
గ్రామాల్లో 25 ఎకరాలు ఉన్నవారిని భూస్వామి అంటారు. ఇలాంటి రైతు కుటుంబాల నెల సగటు ఆదాయం రూ.60,758
రైతు కుటుంబాల్లో 14.2 శాతం మంది రోజువారి కూలీ పనులకు వెళ్తున్నారు.
గ్రామాల్లో వ్యవసాయేతర కుటుంబాల్లో 48.6 శాతం మంది కూలీలుగా వెళ్తున్నారు.
తెలంగాణలో 91.7 శాతం కుటుంబాలు, ఆంధ్రాలో 93 శాతం కుటుంబాలు రుణాల ఊబిలో ఉన్నాయి.
తెలంగాణలో కుటుంబ సగటు రుణం రూ.1,52,113, ఆంధ్రాలో రూ.2,45,554
అత్యధిక రుణాలున్న రాష్ట్రం ఆంధ్రప్రధేశ్, తరువాత కేరళ, 5వ స్థానంలో తెలంగాణ ఉన్నాయి.
Answers
1-3, 2-2, 3-3, 4-3, 5-3, 6-1, 7-3, 8-2,9-2,10-3, 11-1,12-3,13-3,14-2,15-2, 16-3,17-1,18-4,19-3,20-4, 21-1,22-2, 23-1, 24-2,25-4, 26-4,27-3,28-1,29-1,30-2, 31-3,32-4,33-1,34-1,35-1, 36-4,37-1,38-3,39-1, 40-3,
అనంతారపు కృష్ణయ్య
విషయ నిపుణులు
కోదాడ, సూర్యాపేట (జిల్లా)
9948750605