న్యూఢిల్లీ: భారత మేటి చెస్ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ మళ్లీ టాప్ ఫామ్లోకి వచ్చేశారు. నార్వే చెస్ టోర్నమెంట్లో వరల్డ్ నెంబర్ వన్ ప్లేయర్ మాగ్నస్ కార్ల్సన్పై విజయం సాధించారు. క్లాసికల్ సెక్షన్లో భాగంగా జరిగిన అయిదవ రౌండ్లో ఆనంద్ సూపర్ షో కనబరిచారు. అంతకముందు బ్లిట్జ్ ఈవెంట్లోనూ నార్వే సూపర్స్టార్ కార్ల్సన్ను ఆనంద్ ఓడించాడు. ఇక క్లాసికల్ సెక్షన్లో భాగంగా జరిగిన ఆర్మగెడాన్ (సడన్ డెత్ గేమ్)లోనూ ప్రత్యర్థికి ఆనంద్ చుక్కలు చూపించాడు.
వాస్తవానికి రెగ్యుల్ మ్యాచ్ 40 ఎత్తుల వద్ద డ్రాగా ముగిసింది. ఇక ఆర్మగెడాన్ గేమ్లో 52 ఏళ్ల ఆనంద్ తన మ్యూజిక్ ఆటతో కార్ల్సన్పై స్టన్నింగ్ విక్టరీ కొట్టారు. కేవలం 50 ఎత్తుల్లో ఆ విజయాన్ని సొంతం చేసుకున్నారు. దీంతో ఆనంద్ ఖాతాలో మొత్తం 10 పాయింట్లు చేరాయి. ఇంకా నాలుగు రౌండ్లు మిగిలి ఉన్న ఈ టోర్నీలో ఇండియన్ గ్రాండ్మాస్టర్ ఆనంద్ ప్రస్తుతం లీడింగ్లో ఉన్నారు.
క్లాసికల్ సెక్షన్లో ఆనంద్ వరుసగా హ్యాట్రిక్ విజయాలు నమోదు చేశారు. ఫ్రాన్స్కు చెందిన మాక్సిమీ వాచేర్ లాగ్రేవ్, బల్గేరియాకు చెందిన వెసిలిన్ తొపలోవ్, చైనాకు చెందిన హువా వాంగ్లను ఓడించారు. వరల్డ్ నెంబర్ వన్ కార్ల్సన్ 9.5 పాయింట్లతో రెండవ స్థానంలో ఉన్నారు. వెస్లే సో, షక్రియార్ మామెద్యరోవ్లు 8.5 పాయింట్లతో మూడవ స్థానంలో ఉన్నారు. నార్వే చెస్ టోర్నీలో ఒకవేళ క్లాసికల్ గేమ్లో మ్యాచ్ డ్రా అయితే అప్పుడు ప్లేయర్లు ఆర్మగెడాన్(సడన్ డెత్)ను ఆడుతారు.