విభిన్నమైన కథాంశాల్ని ఎంచుకుంటూ నవతరం హీరోల్లో ప్రత్యేకతను చాటుకుంటున్నారు యువ హీరో విశ్వక్సేన్. నేడు ఆయన జన్మదినం. ఈ సందర్భంగా విశ్వక్సేన్ పాత్రికేయులతో మాట్లాడుతూ ‘ఈ బర్త్డే రోజు ‘పాగల్’ షూటింగ్లో పాల్గొనబోతున్నా. సోమవారంతో ఈ సినిమా చిత్రీకరణ పూర్తవుతుంది. ఏప్రిల్ 30న చిత్రాన్ని విడుదలచేయబోతున్నాం. ప్రేమను కొత్త కోణంలో ఆవిష్కరించే చిత్రమిది. నాకు ఓ పట్టాన కథలు నచ్చవు. ప్రతి కథను ‘నో’ చెప్పాలనే ఆలోచనతో వింటుంటా. కథ బాగా నచ్చితేనే సినిమాను ఒప్పుకుంటా. ‘పాగల్’ను అలాగే అంగీకరించా. మణిరత్నం, సుకుమార్, పూరి జగన్నాథ్ నాకు ఇష్టమైన దర్శకులు. వారి శైలి ఈ సినిమాలో కనిపిస్తుంది. నేను టీనేజ్లో ఉన్నప్పుడు ప్రేమలో పడ్డాను. కానీ అది విఫలమైంది.
ఆ భేదాలు లేవు..
దర్శకుల్ని నేను పూర్తిగా విశ్వసిస్తా. కథ, పాత్రల పరంగా నాకున్న అనుమానాల్ని సినిమా ఒప్పుకోవడానికి ముందే నివృత్తి చేసుకుంటా. సెట్లో ఉన్నప్పుడు దర్శకుల పనిలో జోక్యం చేసుకోను. నన్ను ఎైగ్జెటింగ్ చేసే పాయింట్స్ దొరికితే కథలు రాస్తుంటా. ఇటీవల ఓ కథ రాసుకున్నా. నటుడిగా నేను పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకున్నా. ఆ లక్ష్యంతో పోలిస్తే నేను ఇప్పటివరకు సాధించింది చాలా తక్కువే అనుకుంటున్నా. ‘ఓ మై కడావులే’ రీమేక్ ఏప్రిల్ 3న ప్రారంభంకాబోతుంది. పీవీపీ సినిమాస్ ద్వారా ఈ చిత్రం తెరకెక్కుతోంది. అడ్వెంచరస్ డ్రామాగా రూపొందుతున్న ‘ప్రాజెక్ట్ గామీ’ టాకీపార్ట్ పూర్తయింది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో ఓ సినిమా చేయబోతున్నా. ‘ఫలక్నుమా దాస్’కు డీఓపీగా పనిచేసిన సాగర్ దర్శకత్వం వహిస్తున్నారు. రవికిరణ్(‘రాజావారు రాణిగారు’ ఫేమ్) కథను అందిస్తున్నారు.