ప్రస్తుతం ఇండస్ట్రీలో బయోపిక్ల హవా నడుస్తున్న విషయం తెలిసిందే. సినీ, క్రీడా, రాజకీయ రంగాలకు చెందిన పలువురిపై సినిమాలు తీస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నారు మేకర్స్. తాజాగా ప్రముఖ బ్యాడ్మింటన్ గుత్తా జ్వాల జీవిత చరిత్రను కూడా సినిమాగా తీయబోతున్నారట. మరి ఆమె సినిమాను రూపొందించేది మరెవరో కాదు ప్రముఖ తమిళ నటుడు విష్ణు విశాల్. త్వరలో విష్ణు, జ్వాలా గుత్తా మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కానుండగా, ఇప్పుడు ఆయన చేసిన కామెంట్ ఆసక్తిని రేకెత్తిస్తుంది.
కోలీవుడ్లో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్న విష్ణు విశాల్.. రానా నటించిన అరణ్య చిత్రంలో నటించారు. ఈ చిత్రం తమిళంలో కాదన్ పేరుతో రిలీజ్ కానుండగా, ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా మీడియాతో ముచ్చటించారు. ప్రస్తుతం తాను నటించిన 4 సినిమాలు విడుదల కానున్నాయని, అందులో తాను సొంతగా నిర్మించి నటించిన ఎఫ్ఐఆర్, మోహన్ దాస్ చిత్రాలు కూడా ఉన్నాయని చెప్పారు.అలానే గుత్తాజ్వాల బయోపిక్ను నిర్మించే ఆలోచనలో ఉన్నట్టు కూడా పేర్కొన్నారు. వారిది ప్రేమ వివాహం కాదని చెప్పిన విష్ణు.. ఒకరికొకరం అర్థం చేసుకుని గౌరవించుకుని చేసుకుంటున్న పెళ్లి అని చెప్పడం విశేషం.