హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 5: చారిత్రక వేయిస్తంభాల రుద్రేశ్వరాలయంలో ఆదివారం గౌరీనక్త వ్రతాన్ని నిర్వహించారు. ఆలయ నాట్యమండపంలో 41 కిలోల పసుపుతో పార్వతీదేవి ప్రతిమను తయారు చేసి 11 కిలోలతో గౌరీగౌరమ్మను ప్రతిష్ఠంచి గణపతి పూజ నిర్వహించారు. కార్తీక మాసంలో చేపట్టిన ఉపవాస దీక్షను ముగించిన మహిళలు గౌరీనక్త వ్రతం ఆచరించారని ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. ఢిల్లీ నుంచి వచ్చిన వివిధ శాఖల అధికారులు సంజయ్ భట్టాచార్య(సెక్రటరీ, సీపీవీ), అమస్టంగ్ చాంగ్సన్(జాయింట్ సెక్రటరీ, ఓవర్సీస్ ఎంప్లాయీస్), అబ్బగాని రాము(జాయింట్ సెక్రటరీ, ఓవర్సీస్ ఇండియా), సురబాసింగ్(చీఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్, ఇండియా) పూజలు చేశారు. వారికి ఆలయ కార్యనిర్వాహణాధికారి పూర్ణకుంభ స్వాగతం కలికారు. భట్టాచార్య రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు రావడానికి కృషి చేశారని ఇన్టాక్ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారావు తెలిపారు. వారి వెంట కేంద్ర పురావస్తు శాఖ అధికారులు, టూరిజం అధికారులు, పురావస్తు శాఖ జిల్లా అధికారి మల్లేశం, సూపరింటెండెంట్లు ఉన్నారు. వారికి ఆలయ ప్రాశస్థ్యాన్ని పురావస్తుశాఖ కోఆర్డినేటర్ నిరంజన్ వివరించారు.