న్యూఢిల్లీ: రోడ్డు భౌగోళిక స్వరూపాన్ని బట్టి వాహన వేగం ఎంత ఉండాలన్నదానిపై హెచ్చరికలను జారీ చేసే ‘స్మార్ట్ స్పీడ్ వార్నింగ్ సిస్టమ్’ను ఐఐటీ గువాహటి, బాంబే పరిశోధకులు అభివృద్ధి చేస్తున్నారు. కొత్త మోడల్ కార్లలో స్పీడ్ గవర్నర్ డివైజ్ ఉండటాన్ని చూస్తూనే ఉంటాం. అయితే, కొండ ప్రాంతాలు, వంపులు తిరిగిన రహదారులు అని తేడా లేకుండా అన్ని రోడ్లపై ఈ డివైజ్ ఒకేరకంగా పనిచేస్తుంది. అయితే, ఈ స్మార్ట్ సిస్టమ్.. వాహనం ఉన్న ప్రాంతం, రహదారి స్వభావాన్ని బట్టి డ్రైవర్ను అప్రమత్తం చేస్తుందని పరిశోధకులు తెలిపారు.