దక్షిణ కరోలినా: అమెరికాలోని దక్షిణ కరోలినాలో జరిగిన చార్లెస్టన్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ వుమెన్స్ డబుల్స్ ఫైనల్లో సానియా మీర్జా జోడి ఓటమిపాలైంది. చెక్ దేశ క్రీడాకారిణి లూసీ రాడెకాతో జతకట్టి డబుల్స్ ఆడిన సానియా.. ఫైనల్లో 6-2, 4-6, 10-7 స్కోర్ తేడాతో నాలుగవ సీడ్ జంట ఆండ్రెజా క్లెపాక్, మగ్దా లిన్నెట్ చేతిలో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్లో 2 గంటల 35 నిమిషాల పాటు సాగింది. సెమీస్లో టాప్ సీడ్స్ జాంగ్ షూయి జంటపై ఈజీ విక్టరీ కొట్టిన సానియా జోడి ఫైనల్లో తడబడింది. ఈ ఏడాది మేలో జరగనున్న ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీలో సానియా ఆడనున్నది. 2022 సీజన్ ముగిసిన తర్వాత టెన్నిస్ నుంచి రిటైర్ కానున్నట్లు సానియా ప్రకటించిన విషయం తెలిసిందే.
“This place has so many special memories, turning number one in 2015 and winning a few times, so it’s just amazing to be back. Thank you.”
Some nice words from finalist @MirzaSania 😊#CharlestonOpen pic.twitter.com/1yoTwsZhel
— Credit One Charleston Open (@CharlestonOpen) April 10, 2022