సిటీబ్యూరో, నవంబర్ 17(నమస్తే తెలంగాణ): సంధ్య కన్వెన్షన్ శ్రీధర్రావు మోసాలపై బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారని సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర చెప్పారు. ఇప్పటి వరకు ఆయనపై వివిధ పోలీస్స్టేషన్లలో వచ్చిన ఆరు ఫిర్యాదులపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. బాధితులు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు.