హైదరాబాద్: కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సభ్యునిగా రవి కుమార్ పిళ్లై నిమయితులయ్యారు. మాజీ సభ్యుడు హరికేశ్ మీనా స్థానంలో పిళ్లై నియమితులయ్యారు. హరికేశ్ మీనా ఇటీవల పదవీ విరమణ చేసిన విషయం తెలిసిందే. కాగా, కృష్ణా జలవివాదాలకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పరస్పర ఫిర్యాదుల నేపథ్యంలో నదీ యాజమాన్య బోర్డు 14వ సమావేశం బుధవారం జరనుంది. కేఆర్ఎంబీ చైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన హైదరాబాద్లోని జలసౌధలో భేటీ జరుగుతుంది. ఈ సమావేశంలో బోర్డు ప్రతినిధులు, రెండు రాష్ట్రాల అధికారులు పాల్గొంటారు. 2021-22 నీటి సంవత్సరానికి కృష్ణా జలాల్లో రెండు రాష్ట్రాలకు వాటా విషయమై సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు.