హైదరాబాద్ : రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు, మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 4.5కిలోమీటర్ల ఎత్తులో ఉందని తెలిపింది. దీని ప్రభావంతో 24గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని చెప్పింది. వాటి ప్రభావంతో ఆది, సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఒకట్రెండు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఇదిలా ఉండగా.. ఇవాళ ఉదయం వరకు రాజన్న సిరిసిల్ల జిల్లా, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.