నర్సాపూర్, అక్టోబర్ ౨౮ : మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ కమిషనర్ అశ్రిత్కుమార్ను సస్పెండ్ చేస్తూ గురువారం రాత్రి కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇటీవల నర్సాపూర్ పట్టణంలో వీధి కుక్కలకు విషం ఇచ్చి చంపించాడని హైదరాబాద్లోని నల్లకుంటకు చెందిన పీపుల్ యానిమల్ ఫ్రెండ్లీ ఆర్గనైజేషన్ ప్రతినిధి, జంతు ప్రేమికుడు పృథ్వీ మున్సిపల్ కమిషనర్పై నర్సాపూర్ పోలీస్స్టేషన్లో బుధవారం ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి గురువారం కమిషనర్ను సస్పెండ్ చేశారు. కమిషనర్ హెడ్క్వార్టర్ వదిలి ఎక్కడికి వెళ్లకూడదని, అడిషనల్ కలెక్టర్ను ఎంక్వైరీ ఆఫీసర్గా నియమించినట్టు పేర్కొన్నారు.