నర్సంపేట దవాఖానకు మహర్దశ పట్టనుంది. జిల్లాస్థాయి ఆస్పత్రిగా రాష్ట్ర ప్రభుత్వం అప్గ్రేడ్ చేసింది. ఈమేరకు పడకల సామర్థ్యాన్ని 50 నుంచి 250కి పెంచింది. దవాఖాన నూతన భవన నిర్మాణానికి రూ.66.48 కోట్లు కేటాయించింది. పట్టణ పరిధిలో దవాఖాన నిర్మాణానికి కావాల్సిన పదెకరాల స్థలాన్ని కేటాయించే పనులను రెవెన్యూ అధికారులు ఇప్పటికే పూర్తిచేశారు. ఇటీవల హైదరాబాద్లో ఇదే అంశంపై మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే పెద్ది సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. చేయాల్సిన పనులపై దిశానిర్దేశం చేశారు. దీంతో పనులు చకాచకా సాగుతున్నాయి.
నర్సంపేట, డిసెంబర్ 5 : జిల్లాస్థాయి దవాఖాన నర్సంపేట ప్రాంత ప్రజలకు వరంగా మారనుంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా నర్సంపేటకు ఆస్పత్రి మంజూరు చేశారు. గతంలో ఉన్న దవాఖాన రెండు జిల్లాల్లోని మండలాలకు సేవలను అందిస్తోంది. కాగా, రూ.66.48 కోట్ల వ్యయంతో నిర్మాణాలు చేపట్టనున్నారు. పట్టణ పరిధిలో ఆస్పత్రి నిర్మాణానికి కావాల్సిన పదెకరాల స్థలాన్ని కేటాయించేందుకు ఇటీవలే రెవెన్యూ అధికారులు సర్వే చేశారు. ఇటీవల హైదరాబాద్లో ఉన్నతాధికారులతో జిల్లా స్థాయి దవాఖానపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్రావు సమీక్ష చేశారు.
జిల్లా ఆస్పత్రి నిర్మాణానికి రూ.66.48 కోట్లు మంజూరు చేశారు. నర్సంపేటలో ఇప్పటివరకు 50 పడకల ఆస్పత్రి అందుబాటులో ఉంది. అయితే జిల్లా స్థాయి ఆస్పత్రి నర్సంపేటకు మంజూరు కావడంతో స్పెషలిస్టు వైద్యులు అందుబాటులోకి రానున్నారు. ఇప్పడున్న దవాఖానలో కేవలం 15 మంది వైద్యులే సేవలు అందిస్తున్నారు. జిల్లా స్థాయిగా మారడం వల్ల వైద్యుల సంఖ్య 40 నుంచి 50 వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి. నర్సంపేట ఏరియా ఆస్పత్రికి ఈ డివిజన్ నుంచే కాకుండా మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ, గూడురు, గంగారం మండలాలకు చెందిన ప్రజలు కూడా వస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం నర్సంపేట ఆస్పత్రిని అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించింది. జిల్లా స్థాయి ఆస్పత్రి భవన నిర్మాణానికి రూ.56 కోట్లు, వసతుల కల్పనకు రూ.10.48 కోట్లు కేటాయించారు.
జిల్లా స్థాయి దవాఖాన ఏర్పాటుతో ప్రజలకు ఎన్నో సేవలు అందుబాటులోకి రానున్నాయి. సర్జికల్వార్డు, గైనిక్వార్డు, పీడియాట్రిక్ వార్డు, మెడికల్వార్డు, ఆప్స్ట్రిక్స్, ఆర్థో, ఎమర్జెన్సీ, ఈఎన్టీ, ఆఫ్థో, డెర్మటాలజీ విభాగాలు ఏర్పడనున్నాయి. ఒక్కో విభాగానికి సివిల్ సర్జన్, అసిస్టెంట్ సివిల్ సర్జన్లు ఉంటారు. వైద్యులు కూడా అందుబాటులోకి రానున్నారు. దీనివల్ల ప్రజలు వరంగల్, హైదరాబాద్, ఖమ్మం తదతర నగరాలకు వైద్యం కోసం వెళ్లాల్సిన అవసరం ఉండదు. అత్యాధునిక వైద్య పరికరాలు, డయాగ్నసిస్ సేవలు అందుబాటులోకి వస్తాయి.
నర్సంపేటలో 250 పడకల ఆస్పత్రిని నిర్మిస్తామని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. దీనిలో భాగంగా ఆస్పత్రి నిర్మాణానికి నిధు లు మంజూరు చేస్తూ నవంబర్ 3న జీవో విడుదల చేశా రు. స్థలం కేటాయింపు ప్రక్రియను పూర్తి చేశారు. ఇటీవలే దామరచెరువు సమీపంలో రెవెన్యూ శాఖకు చెంది న 10 ఎకరాల స్థలాన్ని వైద్య ఆరోగ్యశాఖకు కేటాయించారు. అడ్వాన్స్ పొజిషన్ను దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ గోపాల్కు అందించారు. స్థలం చుట్టూ హద్దు రాళ్లను పాతే పనులు కూడా పూర్తయ్యయి.
నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందనున్నా యి. జిల్లా స్థాయి ఆస్పత్రి నిర్మాణం కోసం ముఖ్యమం త్రి కేసీఆర్ నిధులు మం జూరు చేశారు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని ఉన్నతాధికారులకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఇటీవల ఆదేశాలు జారీ చేశా రు. ఆస్పత్రికి కావాల్సిన పది ఎకరాల స్థలాన్ని కూ డా కేటాయించాం. ఇకపై మారుమూల పల్లె ప్రజలకు కూడా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. ఆస్పత్రిని మంజూరు చేసినందుకు సీఎంకు కృతజ్ఞతలు.
నర్సంపేటలో 250 పడకల ఆస్పత్రిని నిర్మించేందుకు అవసరమైన స్థలాన్ని రెవెన్యూ శాఖ పొజిషన్ ఇచ్చింది. ఆ స్థలానికి హద్దులను కూడా నిర్ణయించాం. మరింత మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందనున్నాయి. జిల్లా స్థాయి దవాఖానలో ఉండాల్సిన వైద్యులు, పరికరాలు నిబంధనల ప్రకారం వస్తాయి. ఈ ఆస్పత్రి నిర్మాణానికి అవసరమైన నిధులు రూ.66.48 కోట్లు ఇప్పటికే మంజూరు చేశారు. ప్రస్తుతం ఇక్కడ 70 పడకలు అందుబాటులో ఉన్నాయి. కొత్త ఆస్పత్రిలో అన్ని విభాగాలు ఏర్పడుతాయి.