మంగళవారం భీష్మ ఏకాదశిని పురస్కరించుకొని ‘కథానాయకుడు’ సినిమాలో భీష్మునిగా తాను నటించిన సన్నివేశాల తాలూకు ఫొటోల్ని బాలకృష్ణ సోషల్మీడియాలో పోస్ట్చేశారు. ‘నాన్నగారు పోషించిన భీష్మ పాత్ర నాకు చాలా ఇష్టం. అందుకే ‘కథానాయకుడు’ చిత్రంలో భీష్ముడిగా కనిపించాలనుకున్నా. కానీ నిడివి ఎక్కువ అవడంతో ఆ సన్నివేశాల్ని తొలగించాం. భీష్మ ఏకాదశి రోజున ఈ ఫొటోల్ని అందరితో పంచుకోవడం ఆనందంగా ఉంది’ అని బాలకృష్ణ అన్నారు.