ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబై పోలీసు కమిషనర్ పరమ్బీర్ సింగ్ను ఆ రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో ముంబై సీపీగా హేమంత్ నగ్రాలేను నియమించింది. పరమ్బీర్ సింగ్ సీపీగా బాధ్యతలు స్వీకరించి కొద్దిరోజుల క్రితమే ఏడాది పూర్తి చేసుకున్నారు. 1988 బ్యాచ్ ఐపీఎస్ అధికారి పరమ్బీర్ సింగ్ గతేడాది ఫిబ్రవరి 29న ఐపీఎస్ అధికారి సంజయ్ బార్వే నుంచి బాధ్యతలు స్వీకరించారు.
ఫిబ్రవరి 25న ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ ఇంటికి సమీపంలో పేలుడు పదార్థాలతో ఉన్న వాహనం కేసులో ముంబై పోలీస్ అధికారి సచిన్ వాజేకు సంబంధాలున్నట్లు ఆరోపణలు రావడంతో సింగ్పై బదిలీ వేటు వేసినట్లు తెలుస్తోంది. సింగ్ను హోంగార్డ్ డీజీగా బదిలీ చేస్తున్నట్లు మహారాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్ దేశ్ముఖ్ బుధవారం వెల్లడించారు.