న్యూఢిల్లీ, అక్టోబర్ 20: ఈజిప్టులోని ఆస్వాన్కు చెందిన ఓ వ్యక్తి మొబైల్ ఫోన్ను మింగేశాడు. వైద్యుల వద్దకు వెళ్లడానికి సిగ్గుపడ్డాడు. ఫోన్ దానంతట అదే సహజంగా మలద్వారం నుంచి వస్తుందని భావించాడు. ఆరు నెలలు అలాగే ఉన్నాడు. ఫోన్ బయటకు రాలేదు. లోపల అవయవాలు దెబ్బతిన్నాయి. తీవ్రమైన కడుపునొప్పి వేధించింది. ప్రాణాల మీదకు వచ్చింది. తప్పక అతడు వైద్యుల వద్దకు వెళ్లాడు. ఎక్స్రే తీసిన డాక్టర్లు వెంటనే అతనికి శస్త్రచికిత్స చేసి ఫోన్ను తొలగించారు.