జయశంకర్ భూపాలపల్లి : భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి ఆదివారం గణపురం గణప సముద్రం రిజర్వాయర్ నుంచి వానాకాలం పంటకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దాదాపు 50,00 ఎకరాల సాగుకు యోగ్యంగా ఉండే చెరువు నీటిని రైతులందరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
చెరువుకు మరమ్మతులు చేయించాలన్నారు. దానికి కావాల్సిన నిధులను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. రైతులు పంటలను ముందుగా వేసుకోవాలని, ముందు పంటలు వేయడం ద్వారా వడ్ల కొనుగోలు ప్రక్రియ త్వరగా పూర్తవుతుందని ఆయన సూచించారు. రైతులు దాళారులను నమ్మి మోసపోవద్దన్నారు.
సరైన విత్తనాలను ఎంపిక చేసుకొని అధిక దిగుబడులు సాధించాలన్నారు. రైతుల సంక్షేమం సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. సరిపడా నీళ్లు, ఉచిత కరెంట్తో అన్నదాతకు అండగా ఉంటున్నారన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు ఉన్నారు.