మహబూబాబాద్, డిసెంబర్ 5 : కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినా సీఎం కేసీఆర్ ఎక్కడా సంక్షేమ పథకాలను ఆపలేదని ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ పేర్కొన్నారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో ఆయన ఏడు కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ పెద్దమనసుతో అమ లు చేస్తున్న సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరంగా మారిందన్నారు. ప్రైవేటు దవాఖానల్లో చికిత్సపొందిన వారిని సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆదుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి గోగుల రాజు, మాజీ సర్పంచ్ రాజు,దాము, హరి, దిలీప్, చందు, వెంకటర్రెడ్డి పాల్గొన్నారు.