బేగంపేట్ నవంబర్ 30: నాలాపై వంతెన నిర్మాణంతో వాహనదారుల, ప్రజల ఇబ్బందులు తొలగి పో యాయని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. మంగళవారం సనత్నగర్ నియోజకవర్గంలోని రాంగోపాల్పేట్ డివిజన్ రాష్ట్ర పతి రోడ్డులో గల నాలాపై రూ. 2.35 కోట్లతో నిర్మించిన వంతెనను మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఎమ్మెల్సీ సురభి వాణీదేవితో కలిసి ప్రారంభించారు. అనంతరం రాంగోపాల్పేట్ డివిజన్ పరిధిలోని మంజు థియేటర్ డౌన్లో రూ.31 లక్షల వ్యయంతో చేపట్టనున్న వీడీ సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ మాట్లాడుతూ… రాష్ట్రపతి రోడ్డుపై ఉన్న నాలాలోకి ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరద నీరు సక్రమంగా ముందుకు వెళ్లకపోవడంతో పరిసర ప్రా ంతాలు మొత్తం వరద నీటితో నిండిపోయేవన్నారు. అలాగే నిత్యం రద్దీగా ఉండే ఆర్పీ రోడ్డుపై రాకపోకలు సాగించేందుకు తీవ్ర అవస్థలు పడుతుండే వారని తెలిపారు. దీంతో వంతెనను ఎత్తుగా, విశాలంగా ని ర్మించినట్టు వెల్లడించారు. నాలాలో పూడికను పూర్థి స్థాయిలో తొలగించి నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, డీసీ ముకుందరెడ్డి, జలమండలి జీఎం రమణారెడ్డి, టౌన్ ప్లానింగ్ ఏసీపీ క్రిష్టఫర్, కార్పొరేటర్లు కొంతం దీపిక, రాంగోపాల్పేట్ కార్పొరేటర్ చీర సుచిత్ర, మాజీ కార్పొరేటర్ అరుణగౌడ్, ఆకుల రూప, కిరణ్మయికిశోర్, నాయకులు తలసాని స్కైలాబ్, అత్తెల్లి శ్రీనివాస్గౌడ్, ఆకుల హరికృష్ణ, నాగులు, ఆంజనేయులు, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.