సిటీబ్యూరో, నవంబర్ 29(నమస్తే తెలంగాణ): స్వ యం ఉపాధి పొందుతున్న యువతను ప్రోత్సహించేలా ప్ర భుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పా రు. మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాసబ్ ట్యాంక్లోని తన కార్యాలయంలో సోమవారం జిల్లా కలెక్టర్ శర్మన్తో కలిసి వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 17మంది దివ్యాం గ లబ్ధిదారులకు రూ.20 లక్షల విలువైన సబ్సిడీ చెకులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కిరా ణం, జిరాక్స్, సెల్ ఫోన్, టెంట్ హౌస్, ఫొటో స్టూడియో తదితర రంగాలలో స్వయం ఉపాధి పొందుతున్న వారిని ప్రోత్సహించేలా 60 నుంచి 70 శాతం సబ్సిడీపై ప్రభుత్వం రుణాలను అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందాలని కోరారు. కార్యక్రమంలో ఏడీ రాజేందర్, నోడల్ ఆఫీసర్ కృష్ణ, ఎఫ్ఆర్వో పవన్ తదితరులు పాల్గొన్నారు.