Kicha Sudeep | కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ తెలుగు ప్రేక్షకులకి కూడా చాలా సుపరిచితం. ఈగ చిత్రంలో విలన్గా నటించి అశేష ప్రేక్షకాదరణ పొందాడు. సెప్టెంబర్ 1న కిచ్చా సుదీప్ 51వ వసంతంలోకి అడుగుపెట్టగా, ఆయనకి అభిమానులు, సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షల వెల్లువెత్తాయి. తెలుగు ప్రేక్షకులకు ‘ఈగ’ సినిమాతో విలన్గా పరిచయమైనప్పటికీ, ఆ తర్వాత హీరోగా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సుదీప్ . ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న 47వ సినిమా ‘K47’ నుంచి ఒక ప్రత్యేక గ్లింప్స్ను మేకర్స్ విడుదల చేశారు. గ్లింప్స్తో పాటు సినిమా టైటిల్ను కూడా ప్రకటించారు.
మార్క్ ‘MARK’ అనే టైటిల్ని ఫిక్స్ చేయగా, సుదీప్ పుట్టినరోజును పురస్కరించుకుని గ్లింప్స్ విడుదల చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.విజయ కార్తికేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సెంధిల్ త్యాగరాజన్ – అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. రీసెంట్గా విడుదలైన గ్లింప్స్లో సుదీప్ పాత్రను ఒక్కో లక్షణంతో పరిచయం చేశారు. మ్యాడ్, యాటిట్యూడ్, రూత్లెస్, కింగ్ అని చెబుతూ చివర్లో అతని పాత్రకు అసలైన పేరు అజయ్ మార్కండేయ అని చూపించి, ఆ పేరులోని అక్షరాలను ఆధారంగా తీసుకుని టైటిల్ను ‘MARK’ గా ఖరారు చేశారు.
వీడియోలో సుదీప్ పవర్ఫుల్ లుక్తో కనిపించగా, విలన్స్ను సమర్థవంతంగా ఎదుర్కొనే మాస్ క్యారెక్టర్గా కనిపించారు. ఇది పూర్తిగా యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. పుట్టినరోజున ఇలా తన సినిమా నుంచి కీలక అప్డేట్ ఇవ్వడం ద్వారా సుదీప్ అభిమానులకు ఓ బిగ్ సర్ప్రైజ్ ఇచ్చినట్టే అయింది. మరి ఈ సినిమా సుదీప్ కెరీర్లో మరో హిట్గా నిలుస్తుందా లేదా అనేది వేచి చూడాలి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు 60% పూర్తవగా.. అక్టోబర్ నాటికి మొత్తం పూర్తి చేయాలని నిర్ణయించుకున్నట్లు సుదీప్ తెలిపారు. క్రిస్మస్ పండుగ కానుకగా ఈ చిత్రం థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ ప్రాజెక్ట్ తో పాటు ‘బిల్లా రంగా బాషా’ అనే మరో ప్రాజెక్ట్ కూడా చేస్తున్నారు .