న్యూఢిల్లీ : దేశీ మార్కెట్లో కియా సొనెట్ ఎక్స్ లైన్ వేరియంట్ టీజర్ను కియా లాంఛ్ చేసింది. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ అప్డేట్స్తో సెల్టోస్ ఎక్స్ లైన్ తరహాలోనే సొనెట్ ఎక్స్ లైన్ వేరియంట్ను లాంఛ్ చేయనుంది. రాబోయే నెలల్లో కియా సొనెట్ ఎక్స్ లైన్ను మార్కెట్లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేలా కంపెనీ సన్నాహాలు చేపట్టింది.
కియా సెల్టోస్ ఎక్స్లైన్ తరహాలోనే కియా సొనెట్ ఎక్స్ లైన్ మ్యాటి గ్రాఫైట్ పెయింట్ స్కీమ్తో ముందుకు రానుంది. స్టాండర్డ్ సొనెట్లో ఉండే క్రోమ్కు బదులు డార్కర్ షేడ్ గ్రిల్ ఉంటుందని టీజర్లో వెల్లడైంది. కియా సొనెట్ ఎక్స్లైన్ హానీకాంబ్ ప్యాటర్న్తో పాటు కాంట్రాస్టింగ్ గ్రే స్టిచ్చింగ్తో పెరా లీటరెట్ సీట్స్ను కలిగిఉంటుంది.
కియా సెల్టోస్ ఎక్స్ లైన్ను పోలిన తరహాలో సొనెట్ ఎక్స్ లైన్ భారీ అలాయ్ వీల్స్తో కస్టమర్లను ఆకట్టుకోనుంది. ఇక డ్యాష్ బోర్డు డ్యూయల్ టోన్ బ్లాక్, గ్రే కలర్స్లో రానుంది. ఇక ఎక్స్లైన్ వేరియంట్లో మెకానికల్గా ఎలాంటి మార్పులూ చేపట్టలేదు. కలర్స్, అప్గ్రేడ్స్ను బట్టి కియా సొనెట్ ఎక్స్ లైన్ వేరియంట్ రూ 14 లక్షల నుంచి అందుబాటులో ఉంటుంది.