వికారాబాద్ : జిల్లాలోని తాండూరు మండలం కొత్లాపూర్ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో శుక్రవారం కర్నాటక అటవీ శాఖ మంత్రి అరవింద లింబవళి సతీసమేతంగా పూజలు చేశారు. ఆలయ పూజారులు పూర్ణకుంభంతో మంత్రికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రేణుకా ఎల్లమ్మ దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే ఆయన ఆలయ నిర్వాహకులతో మాట్లాడి గుడి అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు. అనంతరం ఆలయంలో మొక్కను నాటారు. మంత్రికి టీఆర్ఎస్ నాయకులు స్వాగతం పలికారు.