న్యూఢిల్లీ: దేశ స్వాతంత్య్రంతో పాటు సమర యోధులపై నటి కంగన రనౌత్ అభ్యంతరకర వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతున్నది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమెకిచ్చిన పద్మశ్రీ అవార్డును వెనక్కు తీసుకోవాలని కోరుతూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) చైర్పర్సన్ స్వాతి మలివాల్ లేఖ రాశారు. పద్మశ్రీ వంటి జాతీయ అవార్డుకు కంగన అనర్హురాలని పేర్కొన్నారు.