న్యూఢిల్లీ, అక్టోబర్ 20: మనీలాండరింగ్ కేసుకు సంబంధించి బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బుధవారం ఈడీ ఎదుట హాజరయ్యారు. ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేసినట్టు అధికారులు తెలిపారు. రూ. 200 కోట్ల కుంభకోణానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సుఖేశ్ చంద్రశేఖర్, ఆయన భార్య లీనా మారియా పౌల్ కేసుకు సంబంధించి విచారణ కోసం జాక్వెలిన్కు ఇప్పటికే అధికారులు మూడుసార్లు నోటీసులు పంపినప్పటికీ ఆమె హాజరుకాలేదు. తాజాగా ఈడీ ఎదుట హాజరైన ఆమె కీలక సమాచారాన్ని ఇచ్చినట్టు తెలుస్తున్నది.