Bathini Suresh : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్గా సీనియర్ ఐఆర్ఎస్ అధికారి బత్తిని సురేశ్ బాధ్యతలు స్వీకరించారు. బత్తిని సురేష్ను తెలుగు రాష్ట్రాల ఇన్కం ట్యాక్స్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్గా నియమిస్తూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) గత గురువారం నియామక ఉత్తర్వులు జారీచేసింది.
ఈ నేపథ్యంలో ఇవాళ ఆయన బాధ్యతలు స్వీకరించారు. గతంలో బత్తిని సురేష్కు హైదరాబాద్ రీజియన్లో ఆదాయ పన్ను శాఖ చీఫ్ కమిషనర్గా పనిచేసిన అనుభవం ఉంది. 1991లో రెవెన్యూ సర్వీసులో చేరిన సురేష్ బత్తిని.. సూరత్లో ఆదాయ పన్ను శాఖలో ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్గా కూడా పనిచేశారు.