పూరీ జగన్నాథ్ ప్రస్తుతం విజయ్దేవరకొండతో కలిసి లైగర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. హై బడ్జెట్ పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామాగా వస్తోన్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీ విడుదల కాకముందే పూరీ మరో ప్రాజెక్టును లైన్లో పెట్టినట్టు తెలుస్తోంది. అయితే ఈ సారి పూరీ శాండల్ వుడ్ హీరోతో సినిమా చేయబోతున్నాడన్న వార్త టాక్ ఆఫ్ టౌన్ గా మారింది.
పొగరు ఫేం ధృవ సార్జా తో పూరీ తర్వాత చిత్రం చేసేందుకు రెడీ అవుతున్నాడని టాక్. చర్చలు నడుస్తున్నాయని వార్తలు వస్తుండగా..దీనిపై పూరీ అండ్ టీం నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదు. పూరీ జగన్నాథ్ గతంలో కన్నడ భాషలో యువరాజా, అప్పు, రోగ్ చిత్రాలను తెరకెక్కించాడు. ఒకవేళ ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ పడితే పూరీకి ఇది శాండల్వుడ్లో నాలుగో సినిమా కానుంది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.