ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 మ్యాచ్లో భారత జట్టు ఐదో వికెట్ కోల్పోయింది. సూర్యకుమార్ యాదవ్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చి ఎడంచేతి వాటం బ్యాటర్ అక్షర్ పటేల్ (6) పెవిలియన్ చేరాడు. నాథన్ ఎల్లీస్ వేసిన 16వ ఓవర్లో అక్షర్ అవుటయ్యాడు. నాథన్ వేసిన స్లోవర్ బంతిని అంచనా వేయలేకపోయిన అక్షర్ పొరబడ్డాడు. భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి లాంగాఫ్లో కామెరూన్ గ్రీన్కు నేరుగా క్యాచ్ ఇచ్చాడు. దీంతో అక్షర్ పెవిలియన్ చేరి దినేష్ కార్తీక్ క్రీజులోకి వచ్చాడు. 16 ఓవర్లకు భారత జట్టు 148/5 స్కోరుతో నిలిచింది.