దక్షిణాది చిత్రసీమలో పూజాహెగ్డే పట్టిందల్లా బంగారం అవుతున్నది. ప్రస్తుతం అగ్రకథానాయకులతో జోడీకడుతూ నంబర్వన్ రేసులో దూసుకుపోతున్నది ఈ అమ్మడు. తాజాగా ఆమె బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్బచ్చన్తో కలిసి నటించే అవకాశాన్ని దక్కించుకున్నది. ఇటీవల ఇన్స్టాగ్రామ్లో అమితాబ్బచ్చన్తో కలిసి సెట్స్లో సరదాగా చిరునవ్వులు చిందిస్తున్న తన ఫొటోను అభిమానులతో పంచుకున్నది పూజాహెగ్డే. ఈ ఫొటో గురించి ఆమె మాట్లాడుతూ ‘ఇండస్ట్రీలో అడుగుపెట్టే సమయంలో నా కలలను పొందుపరుస్తూ ఓ జాబితాను సిద్ధంచేసుకున్నా. వాటిలో బాలీవుడ్ లెజెండ్ అమితాబ్బచ్చన్తో కలిసి నటించాలన్నది మొదటిది. ఆయనతో తెరను పంచుకునే రోజు కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నా. ఆ స్వప్నం నిజమవ్వడం ఆనందంగా ఉంది’ అంటూ తెలిపింది. అయితే వీరిద్దరు కలిసి నటిస్తున్నది ఏ సినిమాలో అన్నది మాత్రం పూజాహెగ్డే వెల్లడించలేదు. ఈ రహస్య ప్రాజెక్ట్కు సుజిత్ సిర్కార్ దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం పూజాహెగ్డే తెలుగులో ‘రాధేశ్యామ్’ ‘ఆచార్య’ సినిమాల్లో నాయికగా నటిస్తున్నది.