హనుమకొండ చౌరస్తా, మార్చి 18: ఈనెల 22న జరగబోయే ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయి ర్యాంకింగ్ చెస్ పోటీల బ్రోచర్లను హనుమకొండ ఏసీపీ పి.నరసింహారావు ఆవిష్కరించారు. వరంగల్ జిల్లా చదరంగ సమైక్య ఆధ్వర్యంలో హనుమకొండ లోని పబ్లిక్ గార్డెన్ ఎదురుగా ఉన్న టీటీడీ కళ్యాణ మండపంలో ఈనెల 22న ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి 4వ ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కార్యదర్శి కన్నా తెలిపారు.
ఈ టోర్నమెంట్లో పాల్గొనే క్రీడాకారులు జనవరి 1, 2016న జన్మించిన వారు అర్హులని, ఇందులో గెలుపొందిన విజేతలకు ప్రశంసాపత్రాలు, ట్రోఫీలు, అందజేయబడుతుందని, ఇతర వివరాలకు 90595 22986 నెంబర్లను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రేమ్సాగర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.