తెలుగుయూనివర్సిటీ, డిసెంబర్ 6: లాక్డౌన్ సమయంలో ప్రజలకు అండగా ఉన్న మనం ఫౌండేషన్ సామాజిక సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సోషల్ ఇంపాక్ట్-19 ప్రశంసా పత్రాన్ని అందించింది. కరోనా సమయంలో లాక్డౌన్తో పేద, మధ్య తరగతి ప్రజలు ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు. ఈ సమయంలో నగరంలోని బస్తీల్లో నివసించే వారికి నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు, గాంధీ, నిమ్స్ దవాఖానలకు ఫేస్ మాస్కులు, శానిటైజర్స్, గ్లౌజులు, పీపీఈ కిట్లు మనం ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆర్ఎస్. కుమార్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రశంసించింది. ఈ మేరకు తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్-19 (టీఎస్ఏజీ) పత్రాన్ని అందజేశారు. మనం సభ్యుల బృందం అమెరికా ప్రతినిధులు కాసర్ల శ్రీని, తపస్వీ రెడ్డి, బాలకిషన్, సచిన్, రామచంద్ర, హరిబాబు, పల్లవి, రమ్య, స్వప్న అందించిన సేవలకు (టీఎస్ఐజీ) మంత్రి కేటీఆర్, ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ అభినందనలతో కూడిన ప్రశంసాపత్రాన్ని సోమవారం అందుకున్నట్లు వెల్లడించారు.