సంగారెడ్డి : దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. బుధవారం జిల్లాలోని హత్నూర మండలం తాహెర్కాన్పేట, తుర్కలఖానాపూర్ గ్రామంలోని సాయిబాబా ఆలయ నాలుగో వార్షికోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రంలో ప్రభుత్వం పండుగలను అంగరంగవైభవంగా నిర్వహించడంతోపాటు ఆలయాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తుందన్నారు. కాగా ప్రతిఒక్కరు భక్తిమార్గంలో నడుచుకోవాలని సూచించారు.
అంతకుముందు ఆలయంలో నిర్వహించిన హోమం, హారతి తదితర పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ఆంజనేయులు, సర్పంచ్లు చంద్రాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.