కందుకూరు, మార్చి 25 : దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం మండల పరిధిలోని గూడూరు గ్రామంలో జరిగిన వెంకటేశ్వరస్వామి కల్యాణోత్సవంలో ఆమె పాల్గొన్నారు. దర్శనం అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. పూరాతన దేవాలయాలను గుర్తించి అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ తీగల అనితారెడ్డి, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, సర్పంచ్ శ్రీలత శ్రీహరి, డైరెక్టర్లు పారిజాతం, సామ ప్రకాశ్ రెడ్డి, నర్సింహ, పార్టీ మండల అధ్యక్షుడు మన్నే జయేందర్ ముదిరాజ్, ఎంపీటీసీ సురుసాని ఎల్లారెడ్డి, మాజీ సర్పంచ్ వేణుగోపాల్, మురళీధర్రెడ్డి, సాంబయ్య, కాకి రాములు తదితరులు పాల్గొన్నారు.
బడంగ్పేట, మార్చి 25 : విద్యాలయాలు, దేవాలయాల అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శారదా లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నాలుగో వార్షికోత్సవాన్ని ఆలయ కమిటీ సభ్యులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మంత్రి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. మంత్రి మాట్లాడుతూ..తెలంగాణ వచ్చిన తర్వాతనే ఆధ్యాత్మికత పెరిగిందని, యాదాద్రి దేవాలయాన్ని సీఎం కేసీఆర్ అభివృద్ధి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, ఫ్లోర్ లీడర్ భూపాల్రెడ్డి, కార్పొరేటర్ సిద్ధాల లావణ్య, మున్సిపల్ టీఆర్ఎస్ అధ్యక్షుడు కామేశ్రెడ్డి, ఆలయ కమిటీసభ్యులు తదితరులు పాల్గొన్నారు.