శంషాబాద్, జనవరి 7: దుబాయ్ నుంచి ఓ ప్రయాణికుడు ట్రాలీబ్యాగ్ ఫ్రేమ్లో రూ.16.18 లక్షల విలువైన బంగారం అక్రమంగా తీసుకొస్తుండగా శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు పట్టుకొన్నారు. శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకున్నది. కస్టమ్స్ అధికారులు తెలిపిన ప్రకారం.. దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన ప్రయాణికుడిపై అనుమానం రావడంతో తనిఖీచేశారు. అతడు తీసుకొచ్చిన ట్రాలీబ్యాగ్ ఫ్రేమ్లో బంగారానికి రేడియం పేస్టుచేసి దాచారు. కస్టమ్స్ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకొన్నారు. పట్టుబడిన బంగారం 330 గ్రాములు ఉందని తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.