సుబేదారి, ఏప్రిల్ 3: మేక తోలుకు రంగేసి పులి చర్మంగా నమ్మించి రూ.16 లక్షలకు విక్రయించడానికి యత్నించిన ఇద్దరు నిందితులను వరంగల్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. అడిషనల్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా బండ్లగూడకు చెందిన రనావత్ ఉన్ద్వార్, ములుగు జిల్లా రాంచంద్రాపూర్కు చెందిన బిల్లా రాజేశ్.. మేక తోలుకు రంగేసి అచ్చం పులి చర్మం మాదిరిగా తీర్చిదిద్దారు.దాన్ని రూ.16 లక్షలకు విక్రయించడానికి ఓ వ్యక్తితో బేరం కుదుర్చుకొన్నారు. హనుమకొండ జిల్లా మహ్మద్గౌస్పల్లి గ్రామ శివారు ప్రాంతంలో పులి చర్మాన్ని విక్రయిస్తున్నట్టు తెలుసుకొన్న పోలీసులు అక్కడికి వెళ్లి నిందితులు రనావత్ ఉన్ద్వార్, రాజేశ్ను అదుపులోకి తీసుకొని, నకిలీ పులి చర్మాన్ని స్వాధీనం చేసుకొన్నారు.