అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని అరకు మాజీ పార్లమెంట్ సభ్యురాలు కొత్తపల్లి గీత దంపతులను సీబీఐ అధికారులు ఇవాళ హైదరాబాద్లో అరెస్టు చేశారు. రుణాల పేరిట పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన కేసులో ఆమెను సీబీఐ అరెస్టు చేసి వైద్య పరీక్షల కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం సీబీఐ కోర్టులో ప్రవేశపెట్టగా ఆమెకు, ఆమె భర్త రామకోటేశ్వరావుకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ. లక్ష జరిమానా చొప్పున విధించింది.
వీరికి సహకరించిన బ్యాంకు అధికారులు జయప్రకాశన్, అరవిందాక్షన్కు ఐదేళ్ల జైలు శిక్ష, విశ్వేశ్వర ఇన్ఫ్రాకు రెండు లక్షల రూపాయలను జరిమానాను కోర్టు విధించింది. విశ్వేశ్వర ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతో పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి గీత రూ.52 కోట్ల లోన్ తీసుకున్నారు. బ్యాంకుకు తప్పుడు వివరాలను అందించారని,బ్యాంకును మోసం చేశారని ఆరోపిస్తూ సీబీఐ 2015 జూన్ 30న గీత, ఆమె భర్త రామకోటేశ్వరావు తోపాటు మరో ముగ్గురుపై చార్జిషీట్ దాఖలు చేసింది.
నాడు విచారించిన కోర్టు ఆమె భర్తను ప్రత్యేక జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు దోషిగా నిర్ధారించి అతను బ్యాంకుకు రూ. 25.25 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. రెండు సంవత్సరాల సాధారణ జైలు శిక్ష విధించిం ది. కోర్టు గీతను నిర్దోషిగా ప్రకటించింది.అయితే నిర్దేశించిన గడువులోగా వీటిని చెల్లించకపోవడంతో ఇరువు రిపై బ్యాంక్ అధికారులు మరోసారి కేసు నమోదు చేయగా సీబీఐ కోర్టు ఇవాళ భార్య, భర్తను అరెస్టు చేశారు.