రేవంత్ చెప్పింది: ఈ ఏడాది మే 7న రాజేందర్ నన్ను కలిశారు. ఆయనకు ఉన్న ఇబ్బందులు చెప్పుకొన్నాడు’ ఇదీ రేవంత్రెడ్డి స్వయంగా చెప్పిన మాటలు..
అసలు విషయం: రాజేందర్ రాజీనామా జేసిందే.. జూన్ 4న. రేవంత్ చెప్పిన మే 7 వ తేదీనాటికి ఆయన ఇంకా మంత్రిగానే కొనసాగుతున్నారు. అప్పటికి ఈటలపై ఆరోపణలు కూడా బయటపడలేదు. అట్లాంటప్పుడు ఆయనకు అంతగా ఉన్న బాధలేమిటి?
రేవంత్ చెప్పింది: ఈటల కాంగ్రెస్లో చేరితే టీఆర్ఎస్ ఖతమైతదని.. కిషన్రెడ్డిని మే 24న ప్రత్యేక విమానంలో కేసీఆర్, కేటీఆర్ రప్పించి బీజేపీలో చేర్పించింది వాస్తవం కాదా?
అసలు విషయం: ఈటల పార్టీని వీడిన తర్వాత ఏ పార్టీలో చేరితే టీఆర్ఎస్కు ఏమి సంబంధం? విమానం మాటెలా ఉన్నప్పటికీ.. రాజేందర్ కాంగ్రెస్లో చేరడానికి కుట్ర చేసినట్టు బహిరంగంగానే ఒప్పుకొన్నడు.
హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): వాహ్.. తోడుదొంగలు అడ్డంగా దొరికిపోయారోచ్.. ఓటుకునోటు దొంగ రేవంత్రెడ్డి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మధ్య చీకటి ఒప్పందాన్ని వాళ్లిద్దరే స్వయంగా బయటపెట్టుకొన్నారు. టీఆర్ఎస్కు వ్యతిరేకంగా వారి కుట్ర పూర్తిగా బట్టబయలైంది. మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు అక్షర సత్యాలైనాయి. ఇద్దరి కుట్ర రట్టు కావడంతో కలిస్తే తప్పేమిటంటూ భుజాలు తడుముకొంటున్నారు. శనివారం ఉదయం కొద్ది నిమిషాల తేడాతో కూడబలుక్కున్నట్టు ఇద్దరు నేతలూ తాము కలుసుకొన్న విషయాన్ని చెప్పుకొన్నారంటేనే మతలబు ఏమిటో కాస్తోకూస్తో రాజకీయజ్ఞానమున్నవాళ్లెవరికైనా అర్థమవుతుంది.. ఈ ఇద్దరు నేతల కుట్రల కుమ్మక్కులకు సాక్ష్యాలివీ…
ఈ ఏడాది మే 7న రాజేందర్ నన్ను కలిశారు. ఆయనకు ఉనఈ ఏడాది మే 7న రాజేందర్ నన్ను కలిశారు. ఆయనకు ఉన్న ఇబ్బందులు చెప్పుకొన్నాడు’ ఇదీ రేవంత్రెడ్డి స్వయంగా చెప్పిన మాటలు.. రాజేందర్ రాజీనామా జేసిందే.. జూన్ 4న. రేవంత్ చెప్పిన మే 7 వ తేదీనాటికి ఆయన ఇంకా మంత్రిగానే కొనసాగుతున్నారు. అప్పటికి ఈటలపై ఆరోపణలు కూడా బయటపడలేదు. అట్లాంటప్పుడు ఆయనకు అంతగా ఉన్న బాధలేమిటి? టీఆర్ఎస్పార్టీలో కీలకమైన స్థానంలో ఉన్న ఈటల బాధలు చెప్పుకోవడానికి చంద్రబాబు ఏజెంటే దొరికాడా?
గమ్మత్తేమిటంటే.. మే 7 న కాంగ్రెస్ నేత వేం నరేందర్రెడ్డి కొడుకు లగ్నపత్రిక రాసుకొన్న సమయంలో గోల్కొండ రిసార్ట్లో తామిద్దరం కలుసుకొన్నట్టు రేవంత్ వెల్లడించిన కొద్ది నిమిషాలకే హుజూరాబాద్లో ఈటల.. తాను రాజీనామా చేసిన తరువాత రేవంత్ను కలిసినట్టు చెప్పారు.
ఒకరి మాటలకు ఇంకొకరికి పొంతన ఉండదు. మంత్రిగా ఉండి బాధలు చెప్పుకొన్నడని ఒకాయనంటడు.. అబ్బెబ్బే.. రాజీనామా తర్వాతనే అని ఇంకొకాయన చెప్తడు. అంటే ఈటల అధికారంలో ఉన్నప్పటినుంచే ఈ కుమ్మక్కు కూటనీతి రాజకీయం మొదలుపెట్టిండని వేరే చెప్పాలా? అప్పటినుంచి ఇప్పటిదాకా ఎన్నిసార్లు కలుసుకున్నారు.. ఎన్ని సార్లు మాట్లాడుకున్నారో.. ఇద్దరి మాటల్లోనే తెల్వటంలేదా?
అసలు విషయమేమిటంటే.. రాజేందర్ను టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి తీసుకోవడానికి ఆయన మంత్రిగా ఉన్నప్పటినుంచే కుట్ర మొదలైందనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి.
‘మే 24 నాడు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఢిల్లీ నుంచి హుటాహుటిన వచ్చిండు. ఈటలను ఆయన ఫాంహౌస్లో కలిసిండు. మాట్లాడుకున్నాక జూన్ 14 నాడు ఈటల రాజేందర్ బీజేపీలో చేరిండు. కిషన్రెడ్డి ఢిల్లీ నుంచి వచ్చిన ప్రైవేట్ విమానం ఎవరిది? ఈటల రాజేందర్ కాంగ్రెస్లో చేరితే టీఆర్ఎస్ ఖతమైతదని.. కిషన్రెడ్డిని ప్రత్యేక విమానంలో కేసీఆర్, కేటీఆర్ రప్పించి బీజేపీలో చేర్పించింది వాస్తవం కాదా?’ అని రేవంత్ రెడ్డి మరో ఉవాచ.
ఈటల పార్టీని వీడిన తర్వాత ఏ పార్టీలో చేరితే టీఆర్ఎస్కు ఏమి సంబంధం? ఇందుకోసం ప్రత్యేక విమానాన్ని పంపించి మరీ పథకం వేయాల్సినంత అవసరం ఉన్నదా? ఈ కొంచెం ఇంగితం కూడా రేవంత్కు లేకపోయింది. విమానం మాటెలా ఉన్నప్పటికీ.. రాజేందర్ కాంగ్రెస్లో చేరడానికి కుట్ర జరిగిందని బహిరంగంగానే ఒప్పుకొన్నడు. పైగా మే 11న సీఎల్పీ నేత బట్టి విక్రమార్కను, ఉత్తమ్కుమార్రెడ్డిని కూడా ఈటల కలిశాడని బాజాప్తా చెప్పారు. అధికార పార్టీలో ఉంటూ ఓ ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడితో భేటీలు కావడం తర్వాత లెక్కల తేడాలు రావడంతో కాషాయ కండువా కప్పుకొన్నారన్నది వాస్తవం. మంత్రిగా ఉన్నప్పటినుంచే టీఆర్ఎస్కు వ్యతిరేకంగా కుట్రలకు జాయింట్ ఆపరేషన్ మొదలైందనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి?
హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా అప్పుడు కాంగ్రెస్లో ఉన్న కౌశిక్రెడ్డి.. రేవంత్ను కలిస్తే.. కాంగ్రెస్ హుజూరాబాద్లో గెలిచేది లేదని ముఖంమీదే చెప్పారు. ఆ తర్వాత టీఆర్ఎస్, ఈటల ప్రచారం చేసుకొంటున్నా కూడా రేవంత్ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించారు. హుజూరాబాద్కు సంబంధం లేకుండా గజ్వేల్లో.. మరోచోట.. సభలు పెట్టుకొంటూ తిరిగారు. తీరా షెడ్యూలు విడుదలైన తర్వాత మొక్కుబడిగా ఒక బలహీన అభ్యర్థిని కాంగ్రెస్ తరఫున రంగంలోకి దింపారు.
వాస్తవమేమిటంటే.. ఈటలకు పరోక్షంగా మేలు చేయడమే రేవంత్ ఉద్దేశం. ముందే అనుకున్న ప్రకారం ఈటల ఆస్తుల రక్షణ, తన స్వప్రయోజనాల కోసం బీజేపీలో చేరారు. ఎన్నికల తర్వాత.. కాంగ్రెస్లోకి ఈటల రావాలన్నది ఇద్దరి మధ్య జరిగిన చీకటి ఒప్పందం. అందుకోసమే.. అంతర్గతంగా హుజూరాబాద్లో కాంగ్రెస్, బీజేపీ కలసిపనిచేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికి కూడా కాంగ్రెస్ హుజూరాబాద్లో పూర్తిస్థాయిలో ప్రచారం చేయకపోవడం కంటే సాక్ష్యమేమున్నది?
టీఆర్ఎస్ వాళ్లతో తప్ప.. అందరితో మాట్లాడుతా
ఎన్నికల తర్వాత ఈటల కాంగ్రెస్లో చేరుతారనే వ్యాఖ్యల్ని ఏ ఒక్క కాంగ్రెస్ నేత ఖండించకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఉప ఎన్నిక తర్వాత ఈటల కాంగ్రెస్లో చేరుతున్నారా? అని శనివారం మీడియా అడిగిన ప్రశ్నకు కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క సమాధానం దాటేశారు. మరోవైపు, హుజూరాబాద్లో ఈటల మాట్లాడుతూ..‘నేను ఎప్పుడైనా అన్ని పార్టీల నాయకులతో మాట్లాడుతా. కలుస్తా. ఈ ఎన్నిక తర్వాత కూడా కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం పార్టీ వాళ్లను కలుస్తా. ఆ పార్టీలేమైనా నిషేధించబడ్డాయా?’ అని అన్నారు. ఆయన వ్యాఖ్యలో టీఆర్ఎస్ పార్టీ పేరును గానీ, టీఆర్ఎస్ నాయకులను కలుస్తానని ప్రస్తావించకపోవడం గమనార్హం. రాజకీయ భిక్ష పెట్టి ఎమ్మెల్యేను, మంత్రిని చేసి, గుర్తింపు తెచ్చిన పార్టీని, నాయకులకు గుర్తు చేసుకోలేవా? ఇదేనా నీ సంస్కారం అనే ఈటలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.