న్యూఢిల్లీ, మార్చి 19: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న దొడ్ల డెయిరీ వ్యాపార విస్తరణలో భాగంగా శ్రీ కృష్ణ మిల్క్స్ను రూ. 50 కోట్లకు కొనుగోలు చేస్తున్నది. శ్రీ కృష్ణ మిల్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ను పూర్తిగా నగదు చెల్లించి కొనుగోలు చేస్తున్నామని, లావాదేవీ రెండు నెలల్లో ముగుస్తుందని శనివారం స్టాక్ ఎక్ఛేంజీలకు దొడ్ల డెయిరీ తెలిపింది. కర్నాటకలో తొలి ప్రైవేట్ కంపెనీ డెయిరీ అయిన శ్రీ కృష్ణ మిల్క్స్ పాల సేకరణ, ఉత్పత్తి, డెయిరీ ఉత్పత్తుల విక్రయ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.67.27 కోట్ల టర్నోవర్ సాధించింది.