ఆళ్వారుస్వామి జయంతి సభలో దేవీప్రసాదరావు
ముషీరాబాద్, అక్టోబర్ 31: తెలంగాణ వైతాళికుడు వట్టికోట ఆళ్వారుస్వామి అని రాష్ట్ర బేవరేజస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాదరావు పేర్కొన్నారు. గ్రంథాలయ ఉద్యమం నుంచి పౌరహక్కుల దాకా పలు ఉద్యమాల్లో పాలుపంచుకొని తెలంగాణ ప్రజాసాహిత్యానికి ప్రాణంపోసిన మహనీయుడని కొనియాడారు. చిక్కడపల్లి త్యాగరాయగాన సభలో ఆదివారం నిర్వహించిన వట్టికోట జయంతి సభలో ఆళ్వారుస్వామి చిత్రపటానికి దేవీప్రసాదరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమావేశంలో గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి, జస్టిస్ బూర్గుల మధుసూదన్, గీతాదేవి, తోట లక్ష్మి పాల్గొన్నారు.