న్యూఢిల్లీ: 2021-22 మద్యం విధానాన్ని అమలు చేయడంలో విఫలమైన అధికారులపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా చర్యలు తీసుకున్నారు. 11 మంది అధికారులపై ఆయన సస్పెన్షన్ విధించినట్లు తెలుస్తోంది. దీంట్లో ఢిల్లీ ఎక్సైజ్ కమీషనర్ అరవ్ గోపి కృష్ణ, డిప్యూటీ ఎక్సైజ్ కమీషనర్ ఆనంద్ కుమార్ తివారిలుఉన్నారు. నూతన మద్యం విధానాన్ని అమలు చేయడంలో తీవ్రంగా విఫలమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. వీరితో పాటు ముగ్గురు అడ్హక్ అధికారులు, ఆరు మంది ఢిల్లీ ఎక్సైజ్ శాఖ అధికారులపై సస్పెన్షన్ విధించారు. టెండర్లను ఫైనలైజ్ చేయడంలో, సంబంధిత వెండర్లకు టెండర్ బెనిఫిట్లను చేరవేయడంలో విఫలమైన అధికారులపై వేటు వేసినట్లు గవర్నర్ ఆఫీసు పేర్కొన్నది. డైరక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ ఇచ్చిన నివేదిక ఆధారంగా గవర్నర్ సక్సేనా ఈ చర్యలకు దిగారు.