హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం మలయప్పస్వామి కల్పవృక్ష వాహనంపై దర్శనమిచ్చారు. రాజమన్నార్ రూపధారిగా చర్నాకోల చేతబట్టి ఊరేగారు. మాడవీధుల్లో అంగరంగవైభవంగా నిర్వహించిన వాహనసేవలో వివిధ ప్రాంతాల కళాబృందాలు ప్రదర్శనలు ఇచ్చాయి. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. సర్వదర్శనానికి 29 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.